Asianet News TeluguAsianet News Telugu

సముద్రం మధ్యలో కో స్టార్ తో సన్ సెట్ఎంజాయ్ చేస్తున్న దీపికా పదుకొనె

మూవీ షూటింగ్ కోసం అలీభాగ్ వెళ్లిన దీపికా పదుకొనె సముద్రం మధ్యలో.. విలాసవంతమైన షిప్ టాప్ పైకి చేరి , అందమైన సూర్యాస్తమయంలో సేదదీరారు. దర్శకుడు శకున్ బాత్రాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో దీపికా, సిద్దాంత్ చతుర్వేది ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

deepika enjoys sun set with the co star Siddhant Chaturvedi ksr
Author
Hyderabad, First Published Dec 2, 2020, 12:51 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కో స్టార్ సిద్దాంత్ చతుర్వేదితో సన్ సెట్ ఆస్వాదిస్తున్నారు. ఓ మూవీ షూటింగ్ కోసం అలీభాగ్ వెళ్లిన దీపికా పదుకొనె సముద్రం మధ్యలో.. విలాసవంతమైన షిప్ టాప్ పైకి చేరి , అందమైన సూర్యాస్తమయంలో సేదదీరారు. దర్శకుడు శకున్ బాత్రాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో దీపికా, సిద్దాంత్ చతుర్వేది ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. 

ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా తాజా షెడ్యూల్ కోసం అలీభాగ్ వెళ్లడం జరిగింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె, సిద్దాంత్ చతుర్వేది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న దీపికా, విచారణకు హాజరు కావడం జరిగింది. ఆ సమయంలో మానసికంగా దీపికా వేదనకు గురయ్యారు. 

ఇక దీపికా టాలీవుడ్ ఎంట్రీ కూడా సర్వం సిద్ధం అయ్యింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios