తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానులు మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్ర ఫీవర్ తో ఊగిపోతున్నారు. ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసిన సైరా కటౌట్లు, బ్యానర్లు దర్శనం ఇస్తున్నాయి. రాంచరణ్ నిర్మాతగా, దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా చిత్రాన్ని తెరకెక్కించారు.
కర్నూలు ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తొలి స్వాతంత్ర యోధుడిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. కానీ ఆయనకు దక్కాల్సిన గుర్తింపు చరిత్రలో లభించలేదు. చిరంజీవి సైరా చిత్రాన్ని ప్రారంభించిన తర్వాత నరసింహారెడ్డి జీవిత చరిత్రని దేశవ్యాప్తంగా ప్రజలు తెలుసుకుంటున్నారు. పాన్ ఇండియా మూవీగా అక్టోబర్ 2న విడుదలవుతోన్న సైరా చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి.
సౌత్ ఇండియన్ అన్ని భాషలతో పాటు హిందీలో కూడా సైరా చిత్రం విడుదల కానుంది. తాజాగా ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సైరా చిత్రం గురించి కామెంట్స్ చేశాడు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో శ్రీశాంత్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
శ్రీశాంత్ మాట్లాడుతూ.. సైరా టీజర్, ట్రైలర్స్ చూశాను.. బాహుబలి కన్నా పెద్ద చిత్రం. రిలీజ్ రోజున కానీ, ఆ తర్వాత కానీ సైరా చిత్రాన్ని తప్పకుండా చూస్తాను. హైదరాబాద్ లో టీమిండియా ఆడిన ఓ మ్యాచ్ సందర్భంగా చిరంజీవి సర్ ని కలుసుకున్నా. క్రికెట్ లో సచిన్ ఎలాగో.. సినిమాల్లో రజని సర్, చిరు సర్ లెజెండ్స్ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Sep 30, 2019, 5:41 PM IST