Asianet News TeluguAsianet News Telugu

మహేశ్ బాబు ‘ఎస్ఎస్ఎంబీ28’ పై క్రేజీ అప్డేట్.. ఆ హీరోలపైనా త్రివిక్రమ్ దృష్టి.!

‘సర్కారు వారి పాట’తో అభిమానులను, ఆడియెన్స్ ను ఖుషీ చేశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu). ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘ఎస్ఎస్ఎంబీ28’పై ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి క్రేజీ బజ్ వినిపిస్తోంది.
 

Crazy update on Mahesh Babu - Trivikram movie, Festival for fans, Details
Author
Hyderabad, First Published May 19, 2022, 5:53 PM IST

మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్నది. గతంలో బ్లాక్ బాస్టర్ మూవీ ‘అతడు’, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఖలేజా’తో ప్రేక్షకులను అలరించారు. మరోసారి హ్యాట్రిక్ కాంబినేషన్ సెట్ అవడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అంటూ ఎదురుచూస్తున్నారు. ఇటీవల ‘సర్కారు వారి పాట’ చిత్రంతో అభిమానులను, ఆడియెన్స్ ఖుషీ చేసిన మహేశ్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. మహేశ్ బాబు తన 28వ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram), 29వ చిత్రాన్ని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)తో కలిసి చేయనున్నారు. 

ఈ సందర్భంగా ఎస్ఎస్ఎంబీ28 (SSMB28) చిత్రంపై క్రేజీ బజ్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ రానున్నట్టు తెలుస్తోంది. మే 31న మహేశ్ బాబు ఫాదర్, సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను, టైటిల్ ను అనౌన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.  మరోవైపు సినిమా టైటిల్ ను ‘పార్థు’గా పరిశీలించారట. మున్ముందు ఏమైనా మార్పులున్నా ఉండొచ్చు. అదేవిధంగా మరో రెండు నెలల్లోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కరోనా పరిస్థితుల కారణంగా ఈ క్రేజీ కాంబినేషన్ ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేళలకు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ చాలా బలమైన కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో అలరించే త్రివిక్రమ్ ఈసారి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీని తెరకెక్కించబోతున్నట్టుగా కూడా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం టాలీవుడ్ హీరోస్ నితిన్ లేదా శర్వానంద్ లలో ఒకరిని కీలక రోల్ కోసం ఎంపిక చేయనున్నారంట. వీరితో పాటు మరికొంత మంది సీనియర్ నటీనటుల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగా అలాంటి ఆలోచనలోనే ఉంటే.. మహేశ్ అభిమానులు మాత్రం హీరో విజయ్ దేవరకొండ లేదంటే అడివి శేషునైనా తీసుకోవాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. 

మహేశ్ బాబు 28వ చిత్రాన్ని హాసినీ అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్ పై రూపొదించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ థమన్ పేరు గట్టగా వినిపిస్తోంది. జులైలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ చిత్రం అనంతరం మహేశ్ బాబు తన 29వ చిత్రాన్ని రాజమౌళితో కలిసి చేయనున్నారు. ఇటవల Sarkaru Vaari Paataతో మే12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ చిత్రం తొలుత నెగెటివ్ టాక్ ను అందుకుంది. కానీ  ఆ తర్వాతి రెండో రోజు నుంచి బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. వసూళ్లలోనూ అదరగొడుతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios