హీరో మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ ఇదే అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.   

సర్కారు వారి పాట మూవీతో సూపర్ స్టార్ మహేష్ బాబు మరో  హిట్ ఖాతాలో వేసుకున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న ఆయన దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీ ప్రకటించారు. ఇది మహేష్ బాబు 28వ చిత్రంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుందని సమాచారం. రూ. 10 కోట్లతో రూపొందించిన లగ్జరీ హౌస్ సెట్లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ నందు ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. 

కాగా ఈ చిత్ర టైటిల్ పై ఆసక్తికర వార్త ప్రచారం అవుతుంది. దర్శకుడు త్రివిక్రమ్ అనూహ్యంగా ఒక సాఫ్ట్ అండ్ సెంటిమెంటల్ టైటిల్ నిర్ణయించారట. ఎస్ఎస్ఎమ్బీ 28 చిత్రానికి 'అమ్మ కథ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. దర్శకుడు త్రివిక్రమ్ ఈ టైటిల్ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారట. త్రివిక్రమ్ కొరుకునే 'అ' అక్షరంతో మొదలవడంతో పాటు కథకు సెట్ అవుతుందని ఆయన ఆలోచనట. కాబట్టి మహేష్ ఈసారి 'అమ్మ కథ' టైటిల్ తో ఫ్యాన్స్ ని పలకరించనున్నారట. 

అయితే ఈ టైటిల్ పట్ల ఫ్యాన్స్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మహేష్ బాబు లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో చిత్రానికి ఇదేం టైటిల్. అసలు మాకు నచ్చలేదని సోషల్ మీడియా వేదికగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. కాగా ఉగాది కానుకగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తారట. ఆ రోజు పూర్తి స్పష్టత వచ్చే ఆస్కారం కలదు. 

ఇప్పటికే అనుకున్న సమయం కంటే చిత్రీకరణ ఆలస్యమైంది. ఈ క్రమంలో త్వరితగతిన షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు కీలక రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా ఉన్నారు. 

Scroll to load tweet…

కాగా త్వరలో దర్శకుడు రాజమౌళితో  కమిటైన చిత్రాన్ని కూడా మహేష్ బాబు సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుండగా ఈ ఏడాదే మహేష్ బాబు-రాజమౌళిల భారీ పాన్ ఇండియా చిత్రం పట్టాలెక్కనుందట. ఇక రాజమౌళి లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలిచిన నేపథ్యంలో మహేష్ బాబు ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశానికి చేరాయి. మహేష్ బాబు ప్రాజెక్టు బడ్జెట్ విపరీతంగా పెంచేసే సూచనలు కలవు. రూ. 800 కోట్లకు పైగా బడ్జెట్ ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాకు రాజమౌళి అంచనా వేసినట్లు సమాచారం.