సారాంశం
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్, మహేష్ బాబు లాంటి తెలుగు తారల తరువాత బన్నీ ఆ గౌరవం అందుకోబోతున్నారట.
ప్రముఖ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక గుర్తింపు తో పాటు.. అరుదైన గౌరవానికి దక్కించుకున్నట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సాధించిన ఐకాన్ స్టార్.. పుష్ప2 తో అంతకు మించిన ఇమేజ్ ను సాధించడానికి రెడీ అవుతున్నాడు. పుష్ప2ను వచ్చే ఏడాది అగస్ట్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు టీమ్. ఇక తన నటనతో బన్నీ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇక తాజాగా లండన్ లోని ప్రఖ్యాత మేడం తుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు బొమ్మ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
అల్లు అర్జున్ అతి త్వరలో కనిపించనున్నాడు. ఎంతో మంది ప్రముఖుల మైనపు బొమ్మలు లండన్ మ్యూజియంలో కొలువై ఉన్నాయి. అక్కడే అల్జు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారన్నది తాజా సమాచారం. ఇక పుష్ప సినిమాకి గాను బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ ఫ్యాన్స్ తో పాటు పుష్పరాజ్ యాటిట్యూడ్ కి విదేశీయులు సైతం ఫిదా అయిపోయారు. కాగా.. పుష్ప క్యారెక్టర్ కి గాను బన్నీ ఇప్పటిదాకా ఎన్నో అవార్డులు అందుకున్నాడు.
రీసెంట్ గా బెస్ట్ యాక్టర్ కేటగిరిలో జాతీయ అవార్డ్ కూడా అందుకోబోతున్నాడు అల్లు అర్జున్. నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. దీంతో మరోసారి బన్నీ పేరు వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యింది. అయితే.. ఇప్పుడు బన్నీ.. ప్రభాస్, మహేష్ బాబుల తరువాత స్థానంలో చేరినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలైనట్టు సమాచారం. అల్జు అర్జున్ త్వరలోనే లండన్ మ్యూజియాన్ని సందర్శించడంతోపాటు, మైనపు విగ్రహం రూపొందించడానికి కావాల్సిన తన శరీర కొలతలను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
సౌత్ నుంచి ఇప్పటికే చాలా మంది తారల మైనపు విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ప్రభాస్, మహేశ్ బాబు, రజినీకాంత్, ధనుష్.. కమల్ ఇలా చాలామంది తారులు అక్కడ చేరగా.. ఇప్పుడు బన్నీ మైనపు విగ్రహాం కూడా లండన్ మ్యూజియంలో ఏర్పాటు కాబోతోంది. ఈవిషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.