షాక్: బన్నీకి విలన్ గా మారిన కమెడియన్ ఫృధ్వి
దాదాపు మూడు దశాబ్దాలపైగా కష్టపడిన తర్వాత ఇప్పటికి పూర్తి స్దాయి కమిడియన్ గా బిజీ అయ్యారు ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ . తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయనికి ఒక గుర్తింపు, స్థానం లభించాయి.
దాదాపు మూడు దశాబ్దాలపైగా కష్టపడిన తర్వాత ఇప్పటికి పూర్తి స్దాయి కమిడియన్ గా బిజీ అయ్యారు ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ . తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయనికి ఒక గుర్తింపు, స్థానం లభించాయి. దాదాపు స్టార్ హీరో సినిమాలన్నిటిలోనూ కనపడుతూ మంచి నవ్వులు పండించి ఇప్పుడు టాలివుడ్ బిజీ కమిడియన్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆయన తనలో మరో యాంగిల్ ని చూపించబోతున్నారు. త్వరలో ఓ నెగిటివ్ పాత్రలో తెరపై దుమ్ము రేపనున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో పృధ్వీ విలన్ గా కనిపించబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కథలో భాగంగా యంగ్ విలన్ ఉంటే అతని తండ్రిగా ఫృధ్వీ ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు.
క్రూరత్వానికి పరాకాష్టగా ఆ పాత్రను త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అరవింద సమేతలో జగపతిబాబుని ఎంత డిఫరెంట్ గా చూపించారో అదే స్దాయిలో ఫృద్విని సైతం ఓ వెరైటీ గెటప్ ,లుక్ ఇచ్చి హైలెట్ చేయనున్నారు. ఆ క్యారక్టర్ కనుక పడితే కనుక వరసపెట్టి డిఫరెంట్ పాత్రలు ఫృధ్విని వరిస్తాయనటంలో సందేహం లేదు. 1992లో ఆ ఒక్కటి అడక్కు చిత్రం ద్వారా మొదలైన పృధ్వి ప్రయాణం ‘ఖడ్గం’తో ఒక లెవెల్కి, ఇప్పుడీ వరుస సినిమాలతో మరో లెవెల్కి వెళ్ళింది.
ప్రస్తుతానికి వ్యక్తిగతంగా, వృత్తి పరంగా పరిపూర్ణమయ్యనట్లే ఆయన భావిస్తున్నారు. అందరి సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందని చెప్తున్నారు. ఇప్పటివరకు దాదాపు వందకుపైగా చిత్రాలలో నటించారు. ఇండస్ట్రీలో తొక్కేయడాలు లాంటివి ఉండవు. మన వల్ల సినిమాకు ఉపయోగం ఉందనుకుంటే అవకాశాలు అవే వస్తాయి..అని పృధ్వీ అంటూంటారు.