హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న చిత్ర అంత్యక్రియలు నిన్న చెన్నైలో ముగిశాయి. బీసెంట్ నగర్ స్మశానవాటికలో చిత్ర అంత్యక్రియలు నిర్వహించారు. బుల్లితెర ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్ర పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆమెది, ఆత్మ హత్యే అని తేలిందని సమాచారం. ఐతే ఆమె ఆత్మహత్య వెనుక, బలమైన కారణాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
చిత్ర శరీరంపై గాయాలు ఉండడంతో పాటు, ఆమె నాలుగు రోజులుగా హోటల్ లో బస చేయాల్సిన అవసరం ఏమిటనే కోణంలో పోలీసుల విచారణ సాగుతుంది. ఇరు పెద్దల అంగీకారంతో చిత్ర, హేమనాథ్ నిశితార్థం జరిగింది. వీరి పెళ్ళికి ముహూర్తం కూడా కుదిరింది. ఐతే వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని సమాచారం. పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టుకున్నాక కూడా రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
హేమనాథ్ ని పోలీసులు అనేక కోణాలలో విచారిస్తున్నారు. ఇక చిత్ర తల్లి హేమనాథ్ తన కూతురిని కొట్టి చంపేశాడని ఆరోపిస్తున్నారు. చిత్ర ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మరణం వెనుక హేమనాథ్ హస్తం ఉందని ఆమె మీడియాతో తెలియజేశారు. చిత్ర మరణంపై సమగ్ర విచారణ జరగాలని, డిమాండ్ చేస్తున్నారు. నిశ్చితార్ధం తరువాత హేమనాథ్ నిజస్వరూపం బయటపడింది. దానితో వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని చిత్ర తల్లి ఆరోపించడం జరిగింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 11, 2020, 10:23 AM IST