Asianet News TeluguAsianet News Telugu

చిరు,సల్మాన్ కలిసి మరోసారి ....డిటేల్స్

 ఇప్పుడు మరోసారి సల్మాన్ ఖాన్, చిరంజీవి కలిసి కనిపించబోతున్నట్లు సమాచారం.
 

Chiranjeevi,Salman khan to collaborate again?
Author
First Published Dec 25, 2022, 3:05 PM IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా నటించిన రీసెంట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ (GodFather). మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణతో ఆర్‌.బి.చౌద‌రి, ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మించారు. మలయాళ చిత్రం లూసిఫర్ (Lucifer) చిత్రానికి ఇది రీమేక్. సినిమా తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో మెగాభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ సక్సెస్‌పై ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్ఫెషల్ వీడియోను విడుదల చేసి మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలిపారు.  

చిరంజీవి కూడా ఓ వీడియోతో సల్మాన్ ఖాన్ కు బదులిచ్చారు. "థాంక్యూ మైడియర్ సల్లూ భాయ్" అంటూ స్పందించారు.  "మీకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే, గాడ్ ఫాదర్ అద్భుత విజయం వెనుక 'మసూద్ భాయ్' ఒక శక్తిలా నిలిచాడు" అంటూ చిరంజీవి కొనియాడారు. "థాంక్యూ... లవ్యూ సోమచ్... వందేమాతరమ్" అంటూ తన వీడియోలో పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి సల్మాన్ ఖాన్, చిరంజీవి కలిసి కనిపించబోతున్నట్లు సమాచారం.

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ఓ వెబ్ సీరిస్ లో చిరంజీవి, సల్మాన్ కలిసి కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు సల్మాన్ ..చిరంజీవిని అడగటం..ఆయన ఓకే చెప్పటం జరిగిందంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. అన్ని అనుకున్నట్లు కుదిరితే త్వరలోనే ప్రకటన రావచ్చు అంటున్నారు. నెట్  ప్లిక్స్ కోసం ఓ భారీ సీరిస్ ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం విషయానికి వస్తే.., దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’.ఇప్పటికే రిలీజైన ఆల్బమ్‌ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ఇప్పటికే పెద్ద హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మూడవ సింగిల్ కోసం సమయం వచ్చింది. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీని జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios