హోస్ట్ గా సమంత సూపర్ సక్సెస్ అన్న టాక్ వినిపిస్తుంది. రానా, తమన్నా, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ని సమంత ఇంటర్వ్యూ చేశారు. తాజాగా ఈ షోకి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు. ఈ షోలో సమంత చిరంజీవిని తన క్రేజీ ప్రశ్నలతో ఇరుకున పెట్టారు.
టాలీవుడ్ లక్కీ లేడీ సమంత హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగు ఓటిటి యాప్ ఆహాలో ప్రసారం అవుతున్న సామ్ జామ్ టాక్ షోకి వ్యాఖ్యాతగా ఆమె వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకి మంచి ఆదరణ దక్కింది. హోస్ట్ గా సమంత సూపర్ సక్సెస్ అన్న టాక్ వినిపిస్తుంది. రానా, తమన్నా, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ని సమంత ఇంటర్వ్యూ చేశారు. తాజాగా ఈ షోకి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు. ఈ షోలో సమంత చిరంజీవిని తన క్రేజీ ప్రశ్నలతో ఇరుకున పెట్టారు.
కాగా ఈ కార్యక్రమంలో చిరుతో సమంత దోశలు వేయించారు. దోశ వేసి దానిని మీరు తిప్పాలి అన్నారు సమంత. మాములుగా ఎవరైనా తిప్పుతారు, కళ్ళకు గంతలు కట్టుకొని తిప్పుతా అన్నారు చిరంజీవి. అలాగే ఈ షోలో ఓ వికలాంగుడైన బాలుడు చిరు పెయింట్ అద్బుతంగా వేశాడు. అనేక ఆసక్తి విషయాలతో ఈ ఎపిసోడ్ ని ఆహా సిద్ధం చేసినట్లు అనిపిస్తుంది. తాజా ప్రోమోలో ఈ విషయాలన్నీ చూపించారు.
కాగా చిరంజీవి ఆచార్య షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే మూవీ విడుదల లేటైంది. దీనితో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఓ అద్భుతమైన సబ్జెక్ట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా... రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. మణిశర్మ ఆచార్య చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 22, 2020, 1:00 PM IST