Asianet News TeluguAsianet News Telugu

బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధుకి చిరు సత్కారం.. సందడి చేసిన నటి రాధిక

ఇటీవల టోక్యో ఒలింపిక్‌లో బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు కాంస్యం గెలిచింది. ఈ నేపథ్యంలో ఆమెని చిరంజీవి సత్కరించారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌ని ఏర్పాటు చేసి సత్కరించారు. ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

chiranjeevi fecilitated to p v sindhu with radhika shared photo viral
Author
Hyderabad, First Published Aug 21, 2021, 10:05 AM IST

ఇటీవల టోక్యో ఒలింపిక్స్-202`లో కాంస్య పతకం గెలుచుకుని రికార్డ్ సృష్టిచింది బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు. ఆమె బ్యాక్ టూ బ్యాక్‌ ఒలింపిక్స్ లో కాంస్య సాధించిన ఇండియన్ మహిళగా సంచలనం సృష్టించింది. దేశం గర్వించేలా చేసింది. ఈ నేపథ్యంలో పీవీ సింధుకి అనేక మంది టాలీవుడ్‌ సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఆమె క్రీడా స్ఫూర్తిని కొనియాడారు. వారిలో చిరంజీవి కూడా ఉన్నారు. 

ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా పీవీ సింధుని సత్కరించారు. హైదరాబాద్‌లో ఆమెకి ఘనంగా సత్కరించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఓ ఫోటో నెట్టింట్లో వైరల్‌ అవుతుంది. ఇందులో సీనియర్‌ నటి రాధిక, పీవీ సింధు, చిరంజీవి కలిసి ఫోటో దిగారు. రాధిక.. సింధు గెలుచుకున్న మెడల్‌ని పట్టుకుని నవ్వుతూ పోజులివ్వడం ఆకట్టుకుంటుంది. ఈ పిక్‌ని రాధికా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. 

ఆమె చెబుతూ, `పీవీ సింధును కలవడం చాలా సంతోషంగా ఉంది. మిత్రుడు చిరంజీవి.. సింధును సత్కరించే వేడుకలో నేను పాల్గొనడం గొప్ప అనుభూతి పంచింది` అని పేర్కొన్నారు. అయితే అది ఎక్కడ? అనే వివరాలు తెలియజేయలేదు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. ఇదిలా రేపు చిరంజీవి తన 66వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios