Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు ఆ రూమర్లకి చెక్‌ పెట్టిన చిరంజీవి..

`గాడ్‌ ఫాదర్‌` (god father) సినిమా షూటింగ్‌ ఆగిపోయిందని, స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, చిరు(chiranjeevi) సంతృప్తికరంగా లేరనే వార్తలొచ్చాయి. రైటింగ్‌ వర్క్ ఇంకా సరి చేయాల్సి ఉందని, ప్రస్తుతం దర్శకుడు, రైటర్స్ ఆ పనిలో ఉన్నారనే రూమర్లు చక్కర్లు కొట్టాయి.

chiranjeevi break the rumors on his god father shooting
Author
Hyderabad, First Published Sep 23, 2021, 7:00 AM IST

చిరంజీవి(chiranjeevi) ప్రస్తుతం `ఆచార్య`(acharya) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. సరైన రిలీజ్‌ డేట్‌ కోసం వేచిచూస్తున్నారు. ఇందులో తన సరసన కాజల్‌(kajal) హీరోయిన్‌గా నటిస్తుంది. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. కొరటాల శివ దర్శకత్వంలో కమర్షియల్‌, సందేశం మేళవింపుగా ఈ సినిమా రూపొందుతుంది. దేవాదాయశాఖలోని అవినీతి బయటపెట్టే కథాంశంతో తెరకెక్కుతుందని సమాచారం. 

మరోపు తన మరో సినిమాని స్టార్ట్ చేశారు చిరంజీవి. `లూసీఫర్‌`రీమేక్‌ `గాడ్‌ ఫాదర్‌` సినిమా షూటింగ్‌ నేడు(బుధవారం) ఊటిలో మరో షెడ్యూల్‌ని ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాయి. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ ఇటీవల విడుదల కాగా..దానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో కుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయిందని, స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, చిరు సంతృప్తికరంగా లేరనే వార్తలొచ్చాయి. రైటింగ్‌ వర్క్ ఇంకా సరి చేయాల్సి ఉందని, ప్రస్తుతం దర్శకుడు, రైటర్స్ ఆ పనిలో ఉన్నారనే రూమర్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా సినిమా షూటింగ్‌ ప్రారంభంతో ఆ వార్తలకు చెక్‌ పెట్టాడు చిరంజీవి. ఈ సినిమా గురించి యూనిట్‌ చెబుతూ, `ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు మన తెలుగు నేటివిటీకి  తగ్గట్టుగా మార్పులు చేశాం. ఈ మూవీ షూటింగ్ గత నెలలో హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఆ షెడ్యూల్ లో మెగాస్టార్ మీద పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించాం.

తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నాం. మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అధ్బుతమైన సంగీతాన్ని అందించేందుకు సిద్దమయ్యారు. సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు` అని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios