Asianet News TeluguAsianet News Telugu

'చెక్' నిర్మాత ఆనంద్ ప్రసాద్ పై ఛీటింగ్ కేసు,కొడుకు,కోడలు అరెస్ట్


నితిన్ తో రీసెంట్ గా 'చెక్' చిత్రం నిర్మించిన ఆనంద ప్రసాద్...పై చీటింగ్ కేసు నమోదు అయింది. భవ్య ఆనంద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపైనా రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.కోటి అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వలేదని సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Cheating case files against Bhavya Anand Prasad jsp
Author
Hyderabad, First Published Mar 28, 2021, 1:12 PM IST

నితిన్ తో రీసెంట్ గా 'చెక్' చిత్రం నిర్మించిన ఆనంద ప్రసాద్...పై చీటింగ్ కేసు నమోదు అయింది. భవ్య ఆనంద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపైనా రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.కోటి అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వలేదని సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

వివరాల్లోకి వెళితే... ప్రముఖ నిర్మాత వెనిగండ్ల ఆనంద్ ప్రసాద్ (భవ్యాస్ ఆనంద్ ప్రసాద్)పై రామచంద్రాపురం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆనంద్ ప్రసాద్ కుమారుడు, కోడల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. భవ్యా కన్‌స్ట్రక్షన్స్ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత అయిన వి.ఆనంద్ ప్రసాద్ తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆనంద్ ప్రసాద్ 2017లో తమ కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటూ దానికి బదులుగా ఏటా నాలుగు శాతం లాభాలు తిరిగి ఇస్తామని చెప్పి తన దగ్గర రూ.కోటి డబ్బు తీసుకున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు తీసుకొని అసలు ప్రతిఫలం ఇవ్వకుండా దాట వేస్తున్నారని, తిరిగి అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. ఎన్నికల్లో పోటీ చేసి ఒడిపోయినందున తనకు కొంత సమయం ఇవ్వాలని ఆనంద్ ప్రసాద్ గతంలో కోరినట్లు ఫిర్యాదులో వివరించాడు.

తనకు బాచుపల్లి, బరంపేట ప్రాంతాల్లో భూములు ఉన్నాయని, వాటిని మీపేరుపై రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారని అన్నారు. ఇలా చెప్పి కొన్నాళ్ళు గడిపారని ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం ఇవ్వకపోగా చంపుతామని బెదిరించడంతో తాను ఇలా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమనే కాకుండా తన లాగా మరో వంద మంది కూడా మోసం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మోసం చేసిన వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్, అతని భార్య, కుమారుడు, కోడలు, శివ కుమార్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఇప్పటికే కుమారుడిని, కోడల్ని అరెస్ట్ చేసి ఆనంద్ ప్రసాద్ సహా మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇక వి.ఆనంద్ ప్రసాద్ టాలీవుడ్ పలు చిత్రాలను నిర్మించారు. గోపీచంద్‌ హీరోగా శౌర్యం, వాంటెడ్, లౌక్యం, సౌఖ్యం చిత్రాలు.. రవిబాబు దర్శకత్వంలో అమరావతి, తేజ దర్శకత్వంలో నీకూ నాకూ డ్యాష్ డ్యాష్ వంటి చిత్రాలను నిర్మించారు. బాలయ్య-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన పైసా వసూల్ సినిమా కూడా ఈయన బ్యానర్ నుంచే వచ్చింది. నారారోహిత్‌తో శమంతకమణి, ఇటీవల సందడి చేసిన మిడిల్ క్లాస్ మెలడీస్, చెక్ వంటి సినిమాలకు ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios