Asianet News TeluguAsianet News Telugu

రూ.2.5 కోట్ల క్రికెట్ ఫ్రాడ్.. బోని కపూర్ పై కేసు నమోదు!

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త అయిన బోనికపూర్ పై చీటింగ్ కేసు నమోదైంది. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహణ విషయంలో ప్రవీణ్ శ్యామ్ అనే వ్యక్తి బోనికపూర్ తో పాటు మరికొందరిపై ఈ చీటింగ్ కేసు నమోదు చేశారు. దీ

Cheating case filed against Boney Kapoor
Author
Hyderabad, First Published Jun 20, 2019, 2:38 PM IST

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త అయిన బోనికపూర్ పై చీటింగ్ కేసు నమోదైంది. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహణ విషయంలో ప్రవీణ్ శ్యామ్ అనే వ్యక్తి బోనికపూర్ తో పాటు మరికొందరిపై ఈ చీటింగ్ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 

ప్రవీణ్ శ్యామ్ కేసు నమోదు చేసిన వివరాల ప్రకారం 2018లో పవన్ జంగిద్ అనే వ్యక్తి అతడిని కలిశాడట. త్వరలో సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహించబోతున్నామని, ఈ ఈవెంట్ లో బాలీవుడ్ సినీ తారలందరూ తరలివస్తారని తెలిపాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనికపూర్ సహా మరికొంతమంది ఈ ఈవెంట్ కోసం భాగస్వాములవుతున్నారని తెలిపాడు. నీవు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నీ పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని తెలిపాడు. 

పవన్ జంగిద్ తనకు ఈ విషయం చెప్పిన కొన్ని రోజుల తర్వాత బోనికపూర్ మీడియా సమావేశం నిర్వహించి జైపూర్ లో సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. నిజమే అనుకుని తాను 67 లక్షలు, తన స్నేహితుడు 32 లక్షలు పెట్టుబడిగా పవన్ జంగిద్ కు ఇచ్చినట్లు ప్రవీణ్ శ్యామ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కానీ ఇంతవరకు సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ మాత్రం జరగలేదు. దీనితో తన డబ్బు తనకు ఇచ్చేయాలని అడిగితే కుదరదని పవన్ జంగిద్ అంటున్నాడని ప్రవీణ్ శ్యామ్ వాపోతున్నాడు. పవన్ జంగిద్, బోణీకపూర్ మాటలు నమ్మే తాను వారికీ డబ్బు ఇచ్చానని తనతో పాటు 2.5 కోట్ల రూపాయల మొత్తంలో మరికొందరు మోసపోయినట్లు ప్రవీణ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో ప్రాధమిక విచారణ ప్రారంభించారు. అవసరమైతే బోనికపూర్ ని కూడా విచారిస్తామని అంటున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios