‘చంద్రముఖి 2’ షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. రాఘవా లారెన్స్ లుక్ అదిరిందిగా.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్..
తమిళ నటుడు రాఘవా లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా చిత్ర షూటింగ్ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
సౌత్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన చిత్రం ‘చంద్రముఖి’. రజినీకాంత్, జ్యోతికా, నయనతారా కలిసి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు. అయితే ఇదే జోనర్ లో ఆడియెన్స్ ను మరింతగా అలరించేందుకు దీనికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) టైటిల్ తో లైకా ప్రొడక్షన్ వారు చిత్రాన్ని గత నెలలోనే ప్రారంభించారు. తమిళ నటుడు రాఘవా లారెన్స్ (Raghava Lawrence) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిసి చిత్రం సెట్స్ పైకి వచ్చింది. చిత్రం ప్రారంభంలోనే రాఘవా లారెన్స్ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ షూటింగ్ పై తాజాగా అప్డేట్ అందించారు.
మేకర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ‘చంద్రముఖి 2’ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. తొలి షెడ్యూల్ ను కర్ణాటకలోని మైసూర్ లో దాదాపు 15 రోజులకు పైగా చిత్రీకరించారు. ఈ షూటింగ్ లో రాఘవ లారెన్స్, కమెడియన్ వడివేలు, సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ పాల్గొన్నారు. వీరిమధ్య సాగే కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను షూట్ చేశారు. ఈ అప్డేట్ అందిస్తూ.. చంద్రముఖి 2 సెట్స్ నుంచి రాఘవా లారెన్స్ పిక్ ను పంచుకున్నారు. గుడ్ లుకింగ్ డ్రెస్, లాంగ్ హెయిర్, గాగూల్స్ పెట్టుకొని లారెన్స్ అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం లేకుండా త్వరలోనే రెండో షెడ్యూల్ ను కూడా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ‘చంద్రముఖి 2’ కాస్ట్ అండ్ క్రూ సెటప్ పూర్తయ్యింది. టెక్నీషియన్స్, ఆర్ట్స్, తదితరుల ఎంపిక కూడా పూర్తై చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది.
సీక్వెల్ లో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. హీరోయిన్ లక్ష్మిమీనన్ లీడ్ యాక్ట్రెస్ గా నటిస్తోంది. సపోర్టింగ్ క్యారెక్టర్ లో ప్రముఖ కమెడియన్ వడివేలు నటిస్తున్నారు. అలాగే రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రాఘవా లారెన్స్ ముని, కాంచన, గంగ వంటి హర్రర్ చిత్రాలతో ఆకట్టుకోగా.. ‘చంద్రముఖి 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లను చేసింది. దర్శకుడు పీ వాసునే సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్డీ రాజశేఖర్ కెమెరామేన్గా.. ఆర్ట్ డైరెక్టర్ గా తోట తరణి బాధ్యతలు వహిస్తున్నారు.