ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. పద్దతి, తీరు మార్చుకోకపోతే ఓటీటీలకు కూడా  ఇక సెన్సార్లు తప్పవని హెచ్చరించింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది. కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే.. సెన్సార్ తప్పదని వార్నింగ్ కూడా ఇచ్చింది. గత కొంత కాలంగా ఓటీటీ కంటెంట్ విషయంలో జరుగుతున్న వివాదాల దృశ్య కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు. సినిమాటోగ్రఫీ 1952 బిల్ కు కొన్ని సవరణలు చేస్తూ అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో ఈ బిల్ ప్రవేశపెట్టగా అక్కడ పాస్ అయి అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది. ఈ బిల్ లో పలు అంశాలు ఉండగా ముఖ్యంగా పైరసీ, సెన్సార్ అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ బిల్లకు సంబంధించిన చర్చల సందర్భంగా పార్లమెంట్ లో పలువురు ఎంపీలు పలు ఫిర్యాదులు చేశారు. ఓటీటీలో వస్తున్న బోల్డ్, వల్గర్ కంటెంట్ గురించి కూడా కేంద్రమంత్రిని ప్రశ్నించారు. ఓటీటీల్లో పిల్లలు చూడకూడని కంటెంట్ వస్తోందని. ప్యామిలీతో కలిసి చూసే రోజులు పోయాయన్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఓటీటీకి బాగా డిమాండ్ పెరగడంతో... ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడంకోసం.. కొత్తగా వెబ్ సిరీస్ లు.. సినిమాలు ప్రవాహంలా వస్తున్నాయి..కాని అందులో అవసరానికి మించిన బూతులు, శృంగార సన్నివేశాలు.. లాంటి వల్గర్ కంటెంట్ ని పెడుతున్నారు. దీనిపై గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అనేకమంది ప్రముఖులు, ప్రేక్షకులు ఓటీటీకి సెన్సార్ లేకపోవడం వల్లే ఇష్టమొచ్చిన కంటెంట్ టెలికాస్ట్ చేస్తున్నారని, అందుకే ఈ సమస్యల తీరాలంటే ఓటీటీకి కూడా సెన్సార్ తీసుకురావాలని కోరుతున్నారు.

ఈ విషయంలో మాట్లాడిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిస్తూ.. ఇటీవల ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఓటీటీలో కూడా ఎన్నో మంచి కంటెంట్స్ వస్తున్నాయి. కొంతమంది మాత్రమే ఓటీటీల్లో వల్గర్ కటెంట్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే ఓటీటీ సంస్థలతో సమావేశం జరిగింది. ఓటీటీలకు స్వీయ నియంత్రణ అవసరం. ఇదే విషయాన్ని వాళ్ళకి చెప్పాను. ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణలో ఉండి కంటెంట్ ని కంట్రోల్ గా టెలీకాస్ట్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, అవసరమైతే సెన్సార్ కూడా తీసుకురావాల్సి వస్తుందని ఓటీటీ సంస్థలకు చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.