పవన్ చిత్రం... కొత్త షెడ్యూల్ నుంచి కెమెరామెన్ మార్పు!?
పవర్స్టార్ పవన్కల్యాణ్, రానా దగ్గుబాటి తొలిసారి ఈ భారీ మల్టీస్టారర్లో కలిసి నటిస్తున్నారు. మలయాళ హిట్ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్పట్లో ఒకడుండేవాడు` ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమా మధ్యలో టెక్నీషియన్స్ మారటం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. చాలా సార్లు స్టార్స్ సినిమాలకు జరిగింది. కేవలం క్రియేటివ్ ఢిపరెన్స్ లతోనే కాకుండా అంతకు ముందు ఒప్పుకున్న వేరే సినిమాలకు వెళ్లిపోవటం కూడా అందుకు కారణం గా కనపడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజా సినిమా నుంచి ఇంతకాలం పని చేసిన సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెళ్ల వదిలేసి వెళ్లిపోయారనే వార్త మీడియాలో వినిపిస్తోంది. కారణం ఏమిటనేది తెలియదు కానీ..ఆయన ప్లేస్ లో మహేష్ తో భరత్ అనే నేను చేసిన రవి.కె.చంద్రన్ వచ్చి పనిచేస్తున్నారని వినికిడి. అయితే ఈ విషయమై అధికారిక ధృవీకరణ ఏమీ లేదు.
పవర్స్టార్ పవన్కల్యాణ్, రానా దగ్గుబాటి తొలిసారి ఈ భారీ మల్టీస్టారర్లో కలిసి నటిస్తున్నారు. మలయాళ హిట్ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్పట్లో ఒకడుండేవాడు` ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
చిత్ర విశేషాలకు వస్తే.. ఈ సినిమాలో దర్శకుడు వి.వి.వినాయక్ క్యామియో రోల్ పోషించినట్లు సమాచారం. ఆయన సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయిందట. ఒరిజనల్ మలయాళంలో వెర్షన్ లో ఈ సన్నివేశాల్లో డైరెక్టర్ సాచీ కనిపించారు. అదే రోల్ ను తెలుగులో వినాయక్ తో చేయించారు. రానా, వినాయక్ ల మధ్య కాంబినేషన్ సీన్ ఉండబోతోంది. పోలీసులతో గొడవ పడొద్దంటూ రానాకి సలహా ఇచ్చే పాత్రలో వినాయక్ కనిపించనున్నారని సమాచారం.
పృథ్వీ రాజ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో రైటర్ టర్న్డ్ డైరెక్టర్ సాచి రూపొందించిన ఈ చిత్రం ఇద్దరు వ్యక్తుల మొదలైన చిన్న గొడవ ఇగో క్లాష్ కారణంగా ఏ స్థాయికి వెళ్లిందనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళం,హిందీలోనూ ఈ సినిమా రీమేక్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.