బ్రేక్ అవుట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా  సుబ్బు చెరుకూరి దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.  ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. 


 టాలీవుడ్ స్టార్ కమెడియన్‌ బ్రహ్మానందం నట వారసుడ్ని చాలా కాలం క్రితమే దింపారు. 2004 లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాతో తన కొడుకు రాజా గౌతమ్‌ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు బ్రహ్మీ. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుచిత్ర చంద్రబోస్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యిందే తప్ప.. కమర్షియల్ హిట్ కాలేకపోయింది. 

ఆ తరువాత లాంగ్ గ్యాప్ తరువాత ‘వారెవా’, ‘మను’ చిత్రాల్లో నటించాడు రాజా గౌతమ్. ఈ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించేలేకపోయింది. మను చిత్రం కలెక్షన్ల పరంగా ఎక్కువ రాబట్టకపోయిన ప్రేక్షకుల మన్ననలను పొందగలిగింది. అయినా వెనకడుగు వేయకుండా ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…


బ్రేక్ అవుట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సుబ్బు చెరుకూరి దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్‌క‌మింగ్‌ రచయిత తన జీవితానికి ప్రమాదం ఏర్పడినప్పుడు వాటిని ఎలా అధిగమించి బయటపడ్డాడు అనే కథాంశంతో సినిమా రూపుదిద్దుకుంటోంది.

శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె సంతోష్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బ్రేక్ అవుట్ సినిమా పై రాజా గౌతమ్ నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. నటుడిగా ఈ సినిమా ఆయనకు నిలిచి పోతుందేమో చూడాలి. బ్రహ్మానందం కొడుకుగా ఆయనకు మంచి గుర్తింపు అయితే ఎప్పటికీ ఉంటుంది. కానీ ఈ సినిమా తో ఆయనకు నటుడిగా బ్రేక్ వస్తుందా అనేది ప్రధానాంశం.