సారాంశం

ఫిల్మ్ సెలబ్రిటీలను వదిలిపెట్టడం లేదు కరోనా. వరుసగా స్టార్స్ అంతా కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సెలబ్రిటీ కరోనా పేషంట్లు పెరిగిపోతున్నారు.

ఫిల్మ్ సెలబ్రిటీలను వదిలిపెట్టడం లేదు కరోనా. వరుసగా స్టార్స్ అంతా కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సెలబ్రిటీ కరోనా పేషంట్లు పెరిగిపోతున్నారు.

ఇండస్ట్రీలో వరుసగా కరోనా పేషంట్లు పెరిగిపోతున్నారు. టాలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ ను కూడా కరోనా గట్టిగా పీడిస్తోంది. ఆమధ్య మహేష్ బాబు (Mahesh Babu), తమన్, రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) లాంటి స్టార్స్ కరోనా బారిన పడ్డారు. కోలీవుడ్ నుంచి కమల్ హాసన్, ధనుష్ లాంటి స్టార్స్ కూడ కరోనాతో పోరాడారు. ఇక ఇఫ్పుడు బాలీవుడ్ లో కూడా పెద్ద పెద్ద స్టార్స్ ను కరోనా పట్టి పీడిస్తోంది.

రీసెంట్ గా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్(Kajol) కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. రెండు మూడు రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. స్వల్ప కోవిడ్ లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేసుకోగా పాజిటీవ్ అని తెలిసింది. వెంటనే సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లి పోయాను అని ప్రకటించింది కాజోల్.

View post on Instagram
 

 

అందరూ కోవిడ్ విషయోం జాగ్రతగ్గా ఉండంటూ మెసేజ్ ఇచ్చింది కాజోల్(Kajol). ఇలా చాలా మంది స్టార్స్ కోవిడ్ బారిన పడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తూ.. భాత్యతగా.. జాగ్రత్తలు చెపుతున్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ భయంకరంగా వ్యాపిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా మాత్రం కేసుల సంఖ్య తగ్గుతూవస్తోంది. పిబ్రవరి మిడ్ నాటికి కేసులు సంఖ్య అదుపులోకి వస్తుందని భావిస్తున్నారు. ఇక నెక్ట్స్ మన్త్ లాస్ట్ వీక్ నుంచి సినిమా రిలీజ్ లకు రెడీ అవుతున్నారు మేకర్స్.