Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2: తనీష్, దీప్తి కెప్టెన్ గా గెలిచేదెవరు..?

ఒకరిపై ఒకరు పడిపోయి మరీ గోడకి రంగుని అద్దుతున్నారు. మరి ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది. సోషల్ మీడియాలో మాత్రం దీప్తి సునయన.. తనీష్ నే ఎంపిక చేస్తుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి

bigg boss2: who will win captaincy task
Author
Hyderabad, First Published Aug 10, 2018, 6:11 PM IST

బిగ్ బాస్ సీజన్ ఇప్పటికే 60 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ప్రతివారంలానే ఈ వారం కూడా కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ జరుగుతోంది. 'అంతిమయుద్ధం' టాస్క్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దీప్తి, తనీష్ లను కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనమని 'రంగు రబ్బా.. రబ్బా' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో సంచాలకులను ఇంటి సభ్యులే ఎన్నుకోవాలి. ఆ వ్యక్తిదే తుది నిర్ణయం అంటూ బిగ్ బాస్ నియమం పెట్టారు.

దీంతో హౌస్ మేట్స్ ఎవరిని పెడితే బాగుంటుందని ఆలోచిస్తోన్న సమయంలో నేను ఉంటునని చేతులు ఎత్తింది దీప్తి సునయన. ఈ టాస్క్ లో తనీష్, దీప్తి నల్లమోతు ఓ గోడకు పెయింట్ వేయడంలో పోటీ పడాలి. వీరిద్దరి మధ్య గోడ కోసం పోటీ గట్టిగానే జరిగినట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో బట్టి తెలుస్తోంది. ఒకరిపై ఒకరు పడిపోయి మరీ గోడకి రంగుని అద్దుతున్నారు.

మరి ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది. సోషల్ మీడియాలో మాత్రం దీప్తి సునయన.. తనీష్ నే ఎంపిక చేస్తుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.   

 

Follow Us:
Download App:
  • android
  • ios