Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2: హౌస్ లోకి వచ్చి కౌశల్ ఆర్మీపై కామెంట్స్ చేసిన తేజస్వి!

బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే సందడి మొదలైపోయింది. ఆదివారం నాటి ఎపిసోడ్ తో షో ముగియనుంది. ఈ క్రమంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ హౌస్ లోకి రప్పించారు.

bigg boss2: tejaswi comments on kaushal army
Author
Hyderabad, First Published Sep 29, 2018, 10:03 AM IST

బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే సందడి మొదలైపోయింది. ఆదివారం నాటి ఎపిసోడ్ తో షో ముగియనుంది. ఈ క్రమంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ హౌస్ లోకి రప్పించారు. నూతన్ నాయుడు తప్ప అమిత్ తివారీ, రోల్ రైడా, బాబు గోగినేని, భాను శ్రీ, యాంకర్ శ్యామల, కిరీటి దామరాజు, దీప్తి సునైనా, తేజస్వి మదివాడ, గణేష్, సంజనా అన్నే, నందిని రాయ్, నూతన్ నాయుడు, పూజా రామచంద్రన్‌లు హౌస్ లోకి వచ్చి సందడి చేశారు.

హౌస్ లోకి వచ్చిన తేజస్వి.. కౌశల్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఫైనల్స్ కి చేరుకున్న ఐదుగురు కంటెస్టెంట్స్ లో గెలిచేది కౌశల్ అని పరోక్షంగా తనీష్ తో మాట్లాడుతూ.. ఇంత దూరం వచ్చినందుకు మీరు నిరాశ పడకండి అంటూ చెప్పే ప్రయత్నం చేయగా.. తనీష్ 'మేము ఇక్కడ కేవలం మాకు ఓట్లు వేసిన వాళ్ల కోసం మాత్రమే ఉన్నామని' అన్నారు.

ఇక కౌశల్ ఆర్మీని ఉద్దేశిస్తూ వారు కౌశల్ ని గెలిపించడం కోసం మిగిలిన పది మందిని తొక్కేసేరకమని చెప్పింది. అలానే హౌస్ మేట్స్ కూడా హౌస్ లో ఒకరకంగా ఉండి బయటకొచ్చిన తరువాత కౌశల్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారని తెలిపింది. అయితే ఇప్పుడు హౌస్ లోకి వెళ్లిన తేజస్వి బయట పరిస్థితులను చెప్పడం పైగా కౌశల్ ఆర్మీపై కామెంట్స్ చేయడంతో కౌశల్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios