బిగ్ బాస్2: కౌశల్ ని అప్పుడెందుకు ప్రశ్నించలేదు..? హౌస్ మేట్స్ పై నెటిజన్లు ఫైర్!
బిగ్ బాస్ సీజన్2 లో నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హౌస్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు కౌశల్, గీతా, దీప్తి, రోల్ రైడా, తనీష్, సామ్రాట్ లు ఉన్నారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ రూల్స్ సరిగ్గా పాటించడం లేదని అందరినీ నేరుగా నామినేట్ చేసేశారు
బిగ్ బాస్ సీజన్2 లో నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హౌస్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు కౌశల్, గీతా, దీప్తి, రోల్ రైడా, తనీష్, సామ్రాట్ లు ఉన్నారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ రూల్స్ సరిగ్గా పాటించడం లేదని అందరినీ నేరుగా నామినేట్ చేసేశారు. దీంతో హౌస్ మేట్స్ లో ఒకింత అసహనం నెలకొంది.
ముందుగా రూల్స్ అతిక్రమించారంటూ బిగ్ బాస్ కౌశల్ ని హెచ్చరించి నామినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా కౌశల్ పై విరుచుకుపడ్డారు. ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరూ కౌశల్ ని ప్రశ్నించారు. పాత విషయాల ప్రస్తావన తీసుకొస్తూ వారు కౌశల్ పై మండిపడటంతో కౌశల్ అభిమానులు మిగిలిన హౌస్ మేట్స్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
కౌశల్ తో సమస్య ఉన్నప్పుడు అప్పుడే ప్రశ్నించకుండా ఇప్పుడు అందరూ ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ కౌశల్ పై కామెంట్స్ చేయని దీప్తి కూడా అరవడంపై కౌశల్ ఆర్మీ మండి పడుతోంది.
కౌశల్ ని అడిగిన ప్రశ్నలు ముందే అడిగితే ఎక్కడ ఇరుక్కుంటామోనని సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చారని.. ఇప్పుడు అందరూ నామినేట్ అయ్యేసరికి అరుస్తున్నారంటూ హౌస్ మేట్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు వెళ్లిపోతారో చూడాలి!