Bigg Boss Telugu 7: షాకింగ్ ఎలిమినేషన్... ఒకరిని కాపాడటానికి మరొకరు బలి!
ఆదివారం వచ్చిందంటే ఒకరు బిగ్ బాస్ ఇంటిని వీడాల్సి ఉంటుంది. ఆరో వారం మరో షాకింగ్ ఎలిమినేషన్ చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బిగ్ బాస్ తెలుగు 7 ఆరవ వారానికి అమర్ దీప్, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజా, నయని పావని, శోభా శెట్టి, పూజా మూర్తి, అశ్విని శ్రీ నామినేట్ అయ్యారు. సందీప్ కూడా నామినేషన్స్ లో ఉన్నప్పటికీ గౌతమ్ సేవ్ చేశాడు. సీక్రెట్ రూమ్ లో గౌతమ్ కి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. తనకున్న ఈ పవర్ తో ఒకరిని నేరుగా నామినేట్ చేయవచ్చు లేదా నామినేషన్స్ లో ఉన్న ఒకరిని సేవ్ చేయవచ్చు అన్నాడు. గౌతమ్ తాను ఎలిమినేట్ కాకూడదని ఓటేసిన సందీప్ ని సేవ్ చేశాడు.
మంగళవారం నుండే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు ఓటింగ్ లో ఎవరు ముందున్నారు ఎవరు వెనకున్నారో... విశ్వసనీయ సమాచారం అందుతుంది. అందరికంటే టాప్ లో యావర్ దూసుకుపోతున్నాడట. అతడికి ముప్పై శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. ప్రిన్స్ తర్వాత రెండో స్థానంలో అమర్ దీప్ కొనసాగుతున్నాడు. అతడికి ఇరవై శాతం ఓట్ల వరకు వచ్చాయి. మూడో స్థానంలో టేస్టీ తేజా, నాలుగో స్థానంలో అశ్విని శ్రీ, ఐదో స్థానంలో నయని పావని ఉన్నారట.
చివరి రెండు స్థానాల్లో పూజా మూర్తి, శోభా శెట్టి ఉన్నట్లు సమాచారం. వైల్డ్ కార్డు ఎంట్రీల కంటే కూడా తక్కువ ఓట్లు తెచ్చుకున్న శోభా శెట్టి లీస్ట్ లో ఉన్నారట. పూజా-శోభా మధ్య ఒక శాతం ఓటింగ్ తేడా ఉందట. శుక్రవారంతో ఓటింగ్ ముగిసింది. శోభా శెట్టి దాదాపు ఎలిమినేట్ కావడం ఖాయం అన్నారు. అయితే ట్విస్ట్ ఇస్తూ మరో కంటెస్టెంట్ పై వేటు పడిందని అంటున్నారు.
నయని పావనిని ఎలిమినేట్ చేశారట. ఓట్ల ఆధారంగా కాకుండా నయని పావనిని ఇంటికి పంపారంటూ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. సీరియల్ బ్యాచ్ శోభా శెట్టిని కాపాడారని అంటున్నారు. మరి కొన్ని గంటల్లో ఎపిసోడ్ ప్రసారం కానుండగా ఈ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరోవైపు ఆల్రెడీ ఎలిమినేటైన దామిని, రతికా రోజ్, శుభశ్రీలకు బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. వీరిలో ఒకరు బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టనున్నారు.