Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ కి పవర్ అస్త్ర... రైతు బిడ్డ వాళ్ళిద్దరినీ ఎలా గెలిచాడు!


అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ నాలుగో కంటెండర్ అయ్యాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలిచి పోటీలో ఉన్న ఇద్దరికీ ఝలక్ ఇచ్చారు. ఆయన పవర్ అస్త్ర ఎలా గెలిచాడో చూద్దాం... 
 

bigg boss telugu 7 pallavi prashanth wons power astra ksr
Author
First Published Sep 29, 2023, 11:01 PM IST


బిగ్ బాస్ షోలో నాలుగులో కంటెండర్ కోసం పోటీ జరుగుతుంది.  వివిధ దశల్లో గెలిచిన ప్రిన్స్ యావర్, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్ రేసులో నిలిచారు. ఈ ముగ్గురిలో ఒకరు నెక్స్ట్ కంటెండర్ అవ్వనున్నారు. వీరికి బిగ్ బాస్ ఒక పోటీ పెట్టారు. పట్టు వలకురా డింభకా అనే టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ లో పవర్ అస్త్రను ముగ్గురు పట్టుకోవాలి. ఎవరు వదిలేస్తే వాళ్ళు రేసు నుండి తప్పుకున్నట్లు. ఈ గేమ్ లో ఒకరినొకరు కన్విన్స్ కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మిగతా ఇద్దరిని వదిలేయమని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఎవరూ వదల్లేదు. 

దీంతో బిగ్ బాస్ మరో టాస్క్ పెట్టాడు. కదలకురా వదలరా అంటూ ఓ టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ లో గెలిచినవాళ్లకు పవర్ అస్త్ర దక్కుతుంది. శుభశ్రీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ గట్టి పోటీ ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ సహనంగా పవర్ అస్త్రను బోర్డు పై జాగ్రత్తగా పట్టుకున్నాడు. మొదట ప్రిన్స్ యావర్, తర్వాత శుభశ్రీ ఓడిపోయారు. పల్లవి ప్రశాంత్ ని డిస్టర్బ్ చేయాలన్న రతికా రోజ్ ప్లాన్ ఫలించలేదు. పవర్ అస్త్ర గెలిచిన పల్లవి ప్రశాంత్ నాలుగో కంటెండర్ అయ్యాడు. మరో రెండు వారాల వరకు అతడు సేఫ్. 

 14 మందితో షో మొదలైంది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అయ్యారు. దీంతో హౌస్లో 11 మంది ఉన్నారు. ఈ వారానికి తేజా, ప్రియాంక, గౌతమ్, శుభశ్రీ, ప్రిన్స్, రతికా రోజ్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. అంబటి అర్జున్, పూజా మూర్తి, ఫర్జానాతో పాటు మరికొందరు హౌస్లోకి వెళ్లనున్నారట. ఇక చూడాలి కొత్త వాళ్ళు వచ్చాక హౌస్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో... 

Follow Us:
Download App:
  • android
  • ios