బిగ్ బాస్ 5: నాగార్జునకే కన్నీళ్లు తెప్పించిన హౌస్ మేట్స్
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ప్రత్యేక ఎపిసోడ్ డిజైన్ చేశారు. నాగార్జున ట్రెడిషనల్ గా వేదికపైకి ఎంటర్ అయ్యారు.
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ప్రత్యేక ఎపిసోడ్ డిజైన్ చేశారు. నాగార్జున ట్రెడిషనల్ గా వేదికపైకి ఎంటర్ అయ్యారు. ఇంటి సభ్యులని రెండు టీమ్స్ గ విభజించారు. రెండు టీమ్స్ నుంచి ఒక్కొక్కరిని రింగ్ లోకి పిలిచి బల పోటీలు నిర్వహించారు.
మొదట సన్నీ, విశ్వ మధ్య పోటీ జరగగా సన్నీ విజయం సాధించాడు. ఆ తర్వాత లోబో కుమార్తె వీడియో బైట్ ప్రదర్శించగా.. లోబో కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియోలో లోబో కుమార్తె ముద్దు ముద్దుగా మాట్లాడింది. నాన్న నువ్వు విజయం సాధిస్తే నేను కూడా హ్యాపీగా ఉంటాను అని చెప్పింది. ఆ తర్వాత జెస్సి తల్లి వీడియో బైట్ ప్రదర్శించారు. జెస్సి తల్లి మాట్లాడుతూ.. బాగా ఆడుతున్నావు.. ఇలాగే కొనసాగించు అని ప్రోత్సహించింది.
ఇదిలా ఉండగా ఇంతలో నాగార్జున నామినేషన్స్ లో ఉన్న వారిలో ఇద్దరిని సేవ్ చేశారు. మానస్, జెస్సి సేవ్ అయ్యారు. ఆ తర్వాత రవి టీం ఆడపిల్ల విలువ తెలిపేలా అద్భుతమైన స్కిట్ చేశారు. ఈ స్కిట్ లో లోబో ఆడపిల్లలు అంటే ఇష్టం లేని, కొడుకు మాత్రమే కావాలనుకునే తండ్రిగా నటించాడు. ప్రియాంక అతడి భార్యగా నటించింది. వీరిద్దరికి కూతురు పుడుతుంది. దీనితో లోబో తన భార్యని, పాపని వదిలేస్తాడు.
ప్రియాంక తన కుమార్తెని సింగిల్ మదర్ గా పెంచుతుంది. వాళ్ళ కుమార్తె పెరిగి పెద్దై బాగా చదువుకుని మంచి పొజిషన్ కి చేరుకుంటుంది. తన కుమార్తె ఉద్యోగం సంపాదించిన ఆఫీస్ లోనే లోబో ప్యూన్ గా పనిచేస్తుంటాడు. ఆ అమ్మాయి తన కుమార్తె అని తెలుసుకుని లోబో కన్నీరు పెట్టుకుంటాడు. ఈ స్కిట్ చూసి నాగార్జున కళ్ళే చెమ్మగిల్లుతాయి.
ఇక ప్రియా టీం కూడా ఓ స్కిట్ చేస్తారు. రైతుల విలువ, వ్యవసాయ భూమి విలువ తెలిపేలా ప్రియా, విశ్వ, మానస్, సిరి చేసిన స్కిట్ కూడా ఆకట్టుకుంటుంది. కానీ నాగార్జున రవి టీంకే అవార్డు ఇస్తారు.