బిగ్ బాస్ 3: హౌస్ మేట్స్ మధ్య గొడవ పెట్టేసిన బిగ్ బాస్!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్గా 33 ఎపిసోడ్లను పూర్తి చేసి శుక్రవారం నాటితో 34 ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
బిగ్ బాస్ సీజన్ 3 ఐదో వారం పూర్తి చేసుకోబోతుంది. ఈ వారం హౌస్ నుండి ఎవరు వెళ్లబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం నాటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మధ్య బిగ్ బాస్ గొడవ పెట్టేశారు. హౌస్లో గ్రూప్గా ఉన్న పునర్నవి, రాహుల్, వితికా, వరుణ్ల మధ్య బిగ్ బాస్ కారణంగా గొడవ వచ్చింది.
పునర్నవి కోసం.. వితికా, వరుణ్, రాహుల్ గుసగుసలాడిన వీడియోలను కన్ఫెషన్ రూంలో పునర్నవికి సీక్రెట్గా ప్లే చేసి చూపించారు బిగ్ బాస్. వీడియోలు చూసిన పునర్నవి తెగ ఫీల్ అయిపోయింది. ఈ విషయంలో వితికాతో గొడవ పడిన పునర్నవి.. రాహుల్ వద్ద తన బాధను చెప్పుకొని బాధపడింది.
అనంతరం శ్రీముఖిని సీక్రెట్ రూంలోకి పిలిచిన బిగ్ బాస్.. ఆమెకోసం పునర్నవి, రాహుల్, వితికాలు ఎలా మాట్లాడుకున్నారో వీడియో ప్లే చూసి చూపించారు. ఈ వీడియో చూసిన తరువాత శ్రీముఖి ఎమోషనల్ అయింది. ఇక బిగ్ బాస్.. హిమజకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. హౌస్ లో విలన్ గా మారి శాంతి లేకుండా చేయాలని బిగ్ బాస్ చెప్పారు.
ఇలా చేస్తే ఇమ్యునిటీ లభిస్తుందని చెబుతారు. దీంతో రంగంలోకి దిగిన హిమజ హౌస్ మేట్స్ కి చుక్కలు చూపించింది. అయితే హిమజకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ను సరిగా చేయలేకపోవడం వల్ల ఆమెకు ఇచ్చిన ఇమ్యునిటీని కోల్పోయింది.