#NTR30:ఈ సూపర్ స్టార్స్ లో ఎన్టీఆర్ కు విలన్ ఎవరు?
ఈ ముగ్గురులో ఒకరిని విలన్ గా డైరక్టర్ ఫైనలైజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రం అంటే ఈ స్దాయి కసరత్తలు తప్పవు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో మరింత హైప్ నెలకొంది. దానికి తోడు ఆచార్య డిజాస్టర్ తో కొరటాల శివ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దాంతో ప్రతీ అడుగూ ఆచి,తూచి వేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విలన్ ని ఫైనలైజ్ చేసే పనిలో టీమ్ నిమగ్నమైందని తెలుస్తోంది. ఇంతకీ ఎవరు విలన్ గా చేయబోతున్నారు...
తారక్ – కొరటాల ఫిలింలో స్టార్ హీరోని విలన్గా తీసుకునే అవకాసం ఉందంటున్నారు. కథ ప్రకారం పాపులార్టీ ఉన్న హీరో... విలన్ అయితే బాగుంటుందని నిర్ణయించిన కొరటాల శివ.. ఇటీవల కేజీఎఫ్ సినిమాలో అధీరా గా నటించి అలరించిన సంజత్ దత్ ని మొదట అనుకన్నారు. అయితే ఆయన ఒక్కడితోనే ఆగకుండా మరిన్ని ఆప్షన్స్ పెట్టుకున్నారని తెలుస్తోంది. సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ని, విజయ్ సేతుపతిని, విక్రమ్ ని అడుగుతున్నారు. ఈ ముగ్గురులో ఒకరిని విలన్ గా డైరక్టర్ ఫైనలైజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రం అంటే ఈ స్దాయి కసరత్తలు తప్పవు.
ఇక ఇప్పటికే ఎన్టీఆర్ వాయిస్తో ఈ చిత్రం కోసం వదిలిన .. మోషన్ పోస్టర్ లోని 'అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా'.. అనే డైలాగు వైరల్ అయ్యింది. ఇందులో కత్తి పట్టుకొని ఎన్టీఆర్ మాస్ లుక్తో అదరగొట్టాడు.
పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండబోతుంది. యుశసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా ఎవరు నటించనున్నారన్నది మాత్రం ఇంకా సస్పెన్స్గా కొనసాగుతుంది. ఈ సినిమా మార్చి 20 నుంచి షూటింగ్ మొదలుపెట్టి 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.