సమంతకి షాక్... శాకుంతలం వాయిదా అంటూ ఝలక్ ఇచ్చిన మేకర్స్
2022 నవంబర్ 4న శాకుంతలం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అనూహ్యంగా చిత్ర యూనిట్ యూ టర్న్ తీసుకున్నారు. విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
దాదాపు ఏడాది కాలం పోస్ట్ ప్రొడక్షన్ కే శాకుంతలం టీం తీసుకున్నట్లు ఉంది. పౌరాణికగాథ కావడంతో విజువల్స్ కి అధిక సమయం, బడ్జెట్ కేటాయిస్తున్నారు. చాలా కాలంగా శాకుంతలం మూవీ నుండి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇటీవల రిలీజ్ డేట్ ప్రకటించారు. 2022 నవంబర్ 4న శాకుంతలం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అనూహ్యంగా చిత్ర యూనిట్ యూ టర్న్ తీసుకున్నారు. విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
త్రీడీలో విడుదల చేయడం ద్వారా ఆడియన్స్ కి బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వగలమని భావిస్తున్న మేకర్స్.. ప్రకటించిన సమయానికి శాకుంతలం విడుదల చేయలేమన్నారు. శాకుంతలం మూవీతో ఆడియన్స్ కి మరింత గొప్ప అనుభూతి ఇవ్వాలి. దానికి త్రీడి ఫార్మాట్ లో విడుదల చేయడం సరైన మార్గమని దర్శకనిర్మాతలు భావించారట. దీనిలో భాగంగా శాకుంతలం నవంబర్ 4న విడుదల చేయలేము. త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు.
దర్శకుడు గుణశేఖర్ సొంత నిర్మాణ సంస్థలో శాకుంతలం తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ సమంతకు జంటగా నటిస్తున్నారు. అనన్య నాగళ్ళ, నందిని రాయ్ కీలక రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కుమార్తె అర్హ ఈ మూవీతో వెండితెరకు పరిచయం అవుతున్నారు.
శాకుంతలం వాయిదా ప్రకటనతో సమంత ఫ్యాన్స్ పూర్తి నిరాశకు గురవుతున్నారు. దర్శకుడు గుణశేఖర్ త్రీడీ సాకుతో ఇంకెంత కాలం లేటు చేస్తారో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న గుణశేఖర్ ఒక పట్టాన సినిమా పూర్తి చేయరు. ఏళ్లకు ఏళ్ళు సమయం తినేస్తారు. కాగా శాకుంతలం కంటే ముందు రానాతో హిరణ్య కశిప టైటిల్ తో మూవీ ప్రకటించారు. కారణం తెలియదు కానీ దాన్ని పక్కన పెట్టి, సమంత మూవీ లైన్లో పెట్టాడు.