పూనకాలు లోడ్ చేస్తున్న చిరంజీవి.. `భోళాశంకర్` ఫస్ట్ సింగిల్ వచ్చేది ఎప్పుడంటే?
వింటేజ్ లుక్లో చిరంజీవి రచ్చ చేశాడు. అది ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే ఫాలో అవుతున్నారు చిరంజీవి. తన పాత లుక్ని అభిమానులకు మరోసారి చూపించబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి `వాల్తేర్ వీరయ్య` సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చి బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించారు. ఈ సినిమా రెండు వందల కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు యాభై కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఇందులో `పూనకాలు లోడింగ్` అనేపాట ఉన్నట్టుగానే సినిమా ఆడియెన్స్ కి పూనకాలు తెప్పించింది. వింటేజ్ లుక్లో చిరంజీవి రచ్చ చేశాడు. అది ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు.
ఇప్పుడు మళ్లీ అదే ఫాలో అవుతున్నారు చిరంజీవి. తన పాత లుక్ని అభిమానులకు మరోసారి చూపించబోతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `భోళాశంకర్` చిత్రంలోనూ ఆయన లుక్ అలానే ఉంది. మాస్గా, ఇరవై ఐదేళ్ల క్రితం చిరంజీవి ఎలా ఉండేవారో అలానే కనిపిస్తుంది. సినిమా కూడా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుందని అర్థమవుతుంది. ఈ సినిమా తమిళంలో హిట్ అయిన `వేదాళం`కి రీమేక్. దీంతో సినిమా స్టోరీ ఏంటో అర్థమైపోతుంది. కాకపోతే చిరంజీవిని ఎలా చూపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఫారెన్లో సాంగ్ షూటింగ్ చేసుకుని వచ్చారు. దీంతో ఇప్పుడు వరుసగా ప్రమోషన్స్ కార్యక్రమాలు షురూ చేశారు. ఈ సినిమా నుంచి తొలి సాంగ్ని విడుదల చేయబోతున్నారు. తాజాగా ఆ వివరాలు ప్రకటించింది యూనిట్. `భోళా మానియా` పేరుతో తొలి సాంగ్ని విడుదల చేయబోతున్నారు. జూన్ 2 రేపు ఈ పాట ప్రోమోని విడుదల చేయనున్నారు. జూన్ 4న పూర్తి పాట లిరికల్ వీడియోని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది యూనిట్. దీనికి సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్బంగా ఓ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో చేతితో చైన్ తిప్పుతూ, కళ్లజోడు సరిచేసుకుంటూ చిరంజీవి స్టయిల్గా ఇచ్చిన లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. చూస్తుంటే పాట మరో పూనకాలు లోడింగ్ అనేలా ఉండబోతుందనిపిస్తుంది.
ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరుకి జోడీగా తమన్నా హీరోయిన్గా నటిస్తుంది. చిరంజీవికి చెల్లిగా కీర్తిసురేష్ నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇటీవల ఆయన `ఏజెంట్` చిత్రాన్ని నిర్మించారు. అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారీగా నష్టపోయారు. దీంతో ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఆ నష్టాలను భర్తీ చేయాలని భావిస్తున్నారు. మరి `వాల్తేర్ వీరయ్య` మ్యాజిక్ `భోళా శంకర్`కి రిపీట్ అవుతుందా? అనేది చూడాలి.