Asianet News TeluguAsianet News Telugu

అమెరికా థియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్ హంగామా.. సహనం కోల్పోయిన యాజమాన్యం.. ఏం చేశారంటే!?

ప్రపంచ వ్యాప్తంగా ‘వీరసింహారెడ్డి’ గ్రాండ్ రిలీజ్ అయ్యింది. మాస్ గాడ్, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ థియేటర్లలో తెగ సందడి చేస్తున్నారు. కాగా, అమెరికాలోని ఓ థియేటర్ లో ఫ్యాన్స్ చూపించిన జోష్ కు యాజమాన్యం ఫైర్ అయ్యింది. 
 

Balakrishna fans are uproar in American theaters then The owners did this!
Author
First Published Jan 12, 2023, 12:22 PM IST

నందమూరి బాలకృష్ణ (Balakrshna) లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’. సెన్సేషనల్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహించారు. ఈరోజు (2023 జనవరి 12) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. దీంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో అభిమానులు రచ్చ మామూలుగా లేదని తెలుస్తోంది. Veera Simha Reddyని ప్రముఖ యూఎస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ అమెరికాలో భారీ ఎత్తున విడుదల చేసింది. ఈ సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా చేశారు. 

మామూలుగానే బాలయ్య సినిమా అంటే ఎలాంటి హంగామా ఉంటుందో తెలిసిందే. ఓ థియేటర్ లో ఫ్యాన్స్ చూపిన జోష్ కు యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా ప్రదర్శనలో ఉండగానే కాగితాలు విసురుతూ హంగామా చేశారు. దీంతో థియేటర్ లో న్యూసెన్స్ క్రియేట్ అయ్యిందని, యాజమాన్యం అసహనం వ్యక్తం చేసింది. గతంలో తెలుగు సినిమాలను చాలా ప్రదర్శించామని, మునుపెన్నడూ జరగలేదని వెల్లడించారు. దీంతో సినిమా ప్రదర్శనను నిలిపేసి ప్రేక్షకులను బయటకు పంపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరికొన్ని థియేటర్లలో పెద్దగా అల్లరి చేయొద్దని సూచించినట్టు తెలుస్తోంది. మిగితా సెంటర్లలో ‘వీరసింహారెడ్డి’ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక యూస్ ఏలో తొలిరోజే  హాఫ్ మిలియన్ డాలర్స్ ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘వీరసింహారెడ్డి’కి పాజిటివ్ వస్తుండటం విశేషం. మరోసారి ఫ్యాక్షన్ రోల్ లో బాలయ్య నటవిశ్వరూపానికి థియేటర్లు దద్దరిల్లుతున్నట్టు తెలుస్తోంది. పవర్ ఫుల్ డైలాగ్స్, ఊర మాస్ యాక్షన్ సీన్స్, అదిరిపోపోయే బీజీఎం, మ్యూజిక్, పాటలతో అదరగొడుతుందని టాక్ వినిపిస్తోంది. ‘అఖండ’తో దుమ్ములేపిన బాలయ్య ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సన్సేషన్  క్రియేట్ చేస్తారో చూడాలంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నీని, రవిశంకర్ వై నిర్మించారు. నందమూరి బాలకృష్ణ - శృతిహాసన్ జంటగా నటించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, హానీ రోజ్, దునియా విజయ్, నవీన్ చంద్ర, పీ రవిశంకర్, అజయ్ ఘోష్, మురళీ శర్మ, చంద్రిక రవి, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సింగీతం అందించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios