చిరంజీవికి అరవింద స్వామి డబ్బింగ్..?
స్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
స్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో చిత్రం తమిళ వెర్షన్లో చిరంజీవికి అరవింద్ స్వామి డబ్బింగ్ చెప్పనున్నారని తమిళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధృవ చిత్రంలో అరవింద్ స్వామి నటించారు. ఆ అనుభంధం తోనే ఆయన చేతే డబ్బింగ్ చెప్పించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇక బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.
ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం సెప్టెంబర్ 15న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ను కర్నూలులో నిర్వహించబోతున్నారని సమాచారం. అందుకు కారణం నరసింహారెడ్డి ఆ ప్రాంతానికి చెందినవాడే కాకుండా బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకునే ఈ సినిమాను తెరకెక్కించారు.