అనుష్క శెట్టి నయా మూవీ ప్రారంభం.. అంతా సైలెంట్గానే?
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించబోతున్న కొత్త సినిమా ప్రారంభమైంది. `రా రా కృష్ణయ్య` ఫేమ్ పి.మహేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. యూవీ క్రియేషన్లో ఈ సినిమా తెరకెక్కనుంది.
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించబోతున్న కొత్త సినిమా ప్రారంభమైంది. `రా రా కృష్ణయ్య` ఫేమ్ పి.మహేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. యూవీ క్రియేషన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. పూజా కార్యక్రమాల్లో `రాధేశ్యామ్` దర్శకుడు రాధాకృష్ణ.. దేవుడి చిత్ర పటాలపై క్లాప్ నిచ్చారు.
ఇందులో అనుష్క మెయిన్ లీడ్గా నటిస్తుండగా, `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ నవీన్ పొలిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారట. ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ని జరుపుకోనుంది. అయితే ఈ సినిమా ప్రారంభానికి సంబంధించి నిర్మాణ సంస్థగానీ, అనుష్క గానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అనుష్క చివరగా గతేడాది `నిశ్శబ్దం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇది ఓటీటీలో విడుదలై పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో సినిమా సైలెంట్గా ప్రారంభించుకోవడం గమనార్హం.