అనుష్క చేసే సినిమాకు బిజినెస్ ఎంత అవుతుందో తెలిస్తే మతిపోతుంది
అనుష్క సినిమాలు చాలా మంది మీడియం రేంజి హీరోల చిత్రాల కన్నా కూడా మంచి బిజినెస్ చేస్తున్నాయి.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క కొద్ది కాలంగా బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ వరస ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరో హిట్టును తన అకౌంట్లో వేసుకున్నారు.ఈ క్రమంలో ఆమె మలయాళంలో ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే దర్శకుడు క్రిష్ తో కలిసి ''ఘాతి'' అనే చిత్రం చేస్తోంది. ఈ చిత్రం పస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఆ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఈ సినిమాలో అనుష్క మరోసారి వేశ్య పాత్రలో నటించడానికి సిద్ధం అవుతోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో అనుష్క హీరోయిన్గా ఎంపికైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ను ఎనౌన్స్ చేశారు. ఈ నేపధ్యంలో అనుష్క మార్కెట్ ఎంత..ఆమె సినిమాలు ఎంతకు అమ్ముడవుతున్నాయనే చర్చ మొదలైంది.
ట్రేడ్ నుంచి అదుతున్న సమాచారం మేరకు ..అనుష్క సినిమాలు చాలా మంది మీడియం రేంజి హీరోల చిత్రాల కన్నా కూడా మంచి బిజినెస్ చేస్తున్నాయి. ఆమె సినిమా దాదాపు ఇరవై కోట్లు వరకూ బిజినెస్ అవుతోందని చెప్తున్నారు. ''ఘాతి'' సైతం థియేటర్, డిజిటల్,శాటి లైట్ రైట్స్ కలిపి ఇరవై కోట్లు దాకా పలికినట్లు తెలుస్తోంది. తన తోటి హీరోయిన్స్ కాజల్, తమన్నా, శృతి హాసన్ లతో పోలిస్తే అనుష్క మార్కెట్ చాలా బాగుందని చెప్తున్నారు. రజనీ కాంత్, ప్రభాస్, నాగార్జున, మహేష్ వంటి స్టార్స్ తో చేయటమే కాకుండా అరుంధతి, రుద్రమదేవి,భాగమతి వంటి చిత్రాలలో తనేంటో ఇండిడ్యువల్ గా చూపించింది. అదే ఆమెకు ప్లస్ అయ్యిందంటున్నారు. బాహుబలితో ఆమెకు ప్యాన్ ఇండియా మార్కెట్ వచ్చింది. అవన్ని అనుష్కను పూర్తి స్దాయి బిజీ చేస్తున్నాయి.
అనుష్క మళయాళంలో కథనార్- ద వైల్డ్ సోర్సరర్ అనే థ్రిల్లర్ సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి రాజిన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకుగానూ అనుష్క రూ. 6 కోట్లు డిమాండ్ చేసినట్లు వినిపిస్తోంది. ఇకపోతే గతంలో ఒక్క సినిమాకు మూడు కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్న అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టికి ఐదారుకోట్లు తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.