అనుష్క డిజప్పాయింట్.. ఆ సినిమా ఓటీటీలో?
`నిశ్శబ్దం` కూడా ఓటీటీలోనే విడుదలకాబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ లేదు థియేటర్లనే విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.
అనుష్క రెండేళ్ళ గ్యాప్తో చేస్తున్న `నిశ్శబ్దం` సినిమాకి కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమాతో మరోసారి సిల్వర్ స్క్రీన్పై తనేంటో చూపించాలనుకున్న అనుష్కకి నిరాశే ఎదురవుతుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా రిలీజ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఇక ప్రమోషన్ కూడా స్టార్ చేశారు. ఆ వెంటనే కరోనా విజృంభన.. లాక్డౌన్ వేయడం, థియేటర్లు మూత పడటం చకచకా జరిగిపోయాయి.
ఇక అప్పట్నుంచి సినిమా విడుదలపై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. రిలీజ్పై సస్పెన్స్ నెలకొంటూనే ఉంది. థియేటర్లు లేకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ ఫ్లాట్ఫామ్లో విడుదలవుతున్నాయి. దీంతో `నిశ్శబ్దం` కూడా ఓటీటీలోనే విడుదలకాబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ లేదు థియేటర్లనే విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.
కానీ ఈ సినిమా మొత్తానికి ఓటీటీలోనే విడుదల కాబోతుందంటూ వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. అమేజాన్ ప్రైమ్లో ఇది విడుదల కానుందని, ఇప్పటికే డీల్ కూడా కుదిరిందని అంటున్నారు. అన్ని కుదిరితే ఇది వచ్చే నెలలోనే విడుదల కానుంది. మరి ఇది ఎంత వరకు నిజమనేది చూడాలి. ఇక ఇందులో అనుష్క మూగ ఆర్టిస్టుగా నటిస్తుండగా, మాధవన్ సెలబ్రిటీ మ్యూజీషియన్గా కనిపించనున్నారు. షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్
నిర్మిస్తున్నారు.