సారాంశం

యాంకర్‌ శ్రీముఖి ప్రస్తుతం రెండు మూడు షోలతో బిజీగా ఉంది. ఇప్పుడు మరో కొత్త షోకి కమిట్‌ అయ్యింది. అయితే దీపికా పిల్లి షోని ఆమె లాక్కోవడం గమనార్హం. 

శ్రీముఖి యాంకర్‌గా బిజీగా ఉంది. నటిగా ఆమె సక్సెస్‌ కాలేదు. కానీ యాంకర్‌గా దుమ్మురేపుతుంది. ప్రస్తుతం తెలుగు యాంకర్లలో ఆమె టాప్‌ పొజిషియన్‌లో ఉంది. ఒక్కో షోని సొంతం చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా ఇప్పటికే `డాన్స్ ఐకాన్‌` `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌`, `సారంగ దరియా`, `స్టార్ మా పరివారం` వంటి షోస్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో షోని సొంతం చేసుకుంది. అయితే దీపికా పిల్లి షోని కొట్టేయడం గమనార్హం. 

దీపికా పిల్లి, సుడిగాలిసుధీర్‌ యాంకర్లుగా ఓటీటీలో `కామెడీ స్టాక్‌ ఎక్స్ ఛేంజ్‌` షో ప్రసారమైంది. స్టాండప్‌ కామెడీ షోగా ఇది ఆదరణ పొందింది. `ఆహా`లో ఈ షో రన్‌ అయ్యింది. తాజాగా ఈ షో రెండో సీజన్‌ ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పుడు యాంకర్‌ మారింది. దీనికి శ్రీముఖి యాంకర్ గా ఎంపిక కావడం విశేషం. ఈ మేరకు ఆమె మీద ప్రోమో కూడా షూట్‌ చేశారు. తాజాగా దీన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది శ్రీముఖి. 

ఈ షోకి దర్శకుడు అనిల్‌ రావిపూడి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రెండో సీజన్‌లోనూ ఆయన జడ్జ్ గా ఉన్నారు. త్వరలోనే `ఆహా` ఓటీటీలో ఈ షో ప్రారంభం కానుంది. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో రెడ్‌ డ్రెస్‌లో దుమ్మురేపుతుంది శ్రీముఖి. తన భారీ అందాలతో మత్తెక్కిస్తుంది. అంతేకాదు ఈ వీడియో పోస్ట్ చేస్తూ కామెడీ స్టాక్‌ ఎక్స్ ఛేంజ్‌కి క్వీన్‌ అంటూ పోస్ట్ చేయడం విశేషం. ఇక ఇప్పటికే పెద్దగా ఆఫర్లు లేక ఇబ్బంది పడుతుంది దీపికా పిల్లి. ఆమె చేతిలో ఉన్న ఒక్క షోని కూడా శ్రీముఖి లాక్కోవడం గమనార్హం. పాపం దీపికా పిల్లి. 
 

View post on Instagram