ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన `బేబీ` సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఈ డేట్‌ ప్రకటన వినూత్నంగా చేశారు. ఐమాక్స్ వద్ద 70 అడుగుల పోస్టర్ రిలీజ్ చేయడం విశేషం.

విజయ్ దేవరకొండ తమ్ముడు, ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం `బేబీ`. సాయి రాజేష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండగా, విరాజ్‌ అశ్విన్‌ మరో హీరోగా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. గురువారం ప్రసాద్‌ ఐమాక్స్ వద్ద 70 అడుగుల పోస్టర్‌తో రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్ చేశారు. అయితే ఈ పోస్టర్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందులో హీరోయిన్‌ నోట్లో బ్లేడ్‌ పెట్టుకుని, హీరో నోట్లో ఆ బ్లేడ్‌ని పెడుతున్నట్టుగా ఈ పోస్టర్‌ టూ మచ్‌ స్పైసీగా ఉంది. హనీ కిల్లర్‌ తరహాలో ఈ పోస్టర్‌ కనిపిస్తుంది. 

 బ్లేడ్‌తో లిప్‌ కిస్సులతో కూడిన పోస్టర్‌ ఇప్పుడు నేషనల్‌ వైడ్‌గా ట్రెండ్‌ అవుతుంది. అందరిని షాక్‌కి గురి చేస్తుంది. ఈ ఒక్క పోస్టర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. లక్షల పబ్లిసిటీ ఒక్క రోజులో చేసేసింది. ఈ సినిమా ఏంటనేదానిపై అందరి దృష్టి పడింది. ఆనంద దేవరకొండ హీరోగా నటిస్తున్న నేపథ్యంలో ఆ అటెన్షన్‌ మరింత పెరిగింది. అందుకే ఇప్పుడు `బేబీ` మూవీ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ అవుతూ, సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. ఇక `బేబీ` సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ ఐమాక్స్ వద్ద 70 అడుగుల పోస్టర్‌ని రిలీజ్‌ చేయడం కూడా ఈ సినిమాపై చర్చకు దారితీస్తుంది. 

`బేబీ` సినిమాని జులై 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది యూనిట్‌. గతంలోనూ ఈ డేట్ ని వెల్లడించారు. తాజాగా దాన్ని అధికారికంగా కన్ఫమ్‌ చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మొదటి వీడియో గ్లిమ్స్ వచ్చిన దగ్గరి నుంచే ఈ చిత్రం పైన ప్రేక్షకులందరికీ ఆసక్తి నెలకొంది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రతి సాంగ్ తెలుగు సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటూ వచ్చింది. దీంతో సినిమాపై క్రేజ్‌ పెరుగుతూ వచ్చింది.

Scroll to load tweet…

తాజాగా విడుదల తేదీ పోస్టర్ లాంచ్ కి ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ,వైష్ణవి చైతన్యలతో పాటు ఈ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ అలానే ఈ సినిమా నిర్మాత ఎస్ కే ఎన్, కో ప్రొడ్యూసర్ ధీరజ్ అటెండ్ అయ్యారు. ఒక ఇంటెన్స్ లవ్ స్టొరీ తో అందరికీ నచ్చే అంశాలతో జూలై 14న ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపింది టీమ్. ఈ సినిమా ట్రైలర్ ని వచ్చే వారంలో విడుదల చేయనున్నట్టు, అలానే ఈ చిత్ర ప్రమోషన్స్ ని జోరుగా కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఎడిటింగ్ : విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీ : ఎమ్ఎన్ బాల్ రెడ్డి అందిస్తున్నారు.