Asianet News TeluguAsianet News Telugu

పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి అమూల్ ట్రిబ్యూట్... డూడుల్ ఆర్ట్ అదిరిందిగా!


దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యే చిత్రాల డూడుల్ ఆర్ట్స్ విడుదల చేయడం అమూల్ సంస్థకు అలవాటుగా ఉంది. తాజాగా పొన్నియిన్ సెల్వన్ చిత్ర డూడుల్ ఆర్ట్ పోస్టర్ విడుదల చేసింది. 
 

amul company releases ponniyin selvan doodle art fans feeling happy
Author
First Published Oct 3, 2022, 10:50 AM IST

ప్రముఖ మిల్క్ ప్రొడక్ట్స్ సంస్థ అమూల్ పొన్నియిన్ సెల్వన్ డూడుల్ ఆర్ట్ విడుదల చేసింది. విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిషల యానిమేటెడ్ గ్రాఫిక్ డిజైన్ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసింది. డూడుల్ ఆర్ట్ లో కార్తీ, విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష అమూల్ బ్రెడ్ పట్టుకొని కనిపించారు. పొన్నియిన్ సెల్వన్ ప్రధాన పాత్రలతో కూడిన ఈ డూడుల్ ఆర్ట్ ఆకట్టుకుంది. 

కాగా గతంలో ఆర్ ఆర్ ఆర్, పుష్ప, కెజిఎఫ్ 2 చిత్రాల యానిమేటెడ్ గ్రాఫిక్ డిజైన్స్ అమూల్ సంస్థ విడుదల చేసింది. పాప్యులర్ చిత్రాల డూడుల్ ఆర్ట్స్ తో అమూల్ తమ సంస్థ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకుంటుంది. చూడటానికి చాలా భిన్నంగా, ఆకట్టుకునేలా ఉంటున్న ఈ డూడుల్ ఆర్ట్స్ సినిమా లవర్స్ లో ఆసక్తిని రేపుతున్నాయి. 

మరోవైపు పొన్నియిన్ సెల్వన్ కి భారీ రెస్పాన్స్ దక్కుతుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో గత తమిళ చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేసింది. తెలుగులో పొన్నియిన్ సెల్వన్ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. తెలుగు వెర్షన్ లాభాలు పంచడం ఖాయంగా కనిపిస్తుంది. నైజాంలో రెండు రోజులకు పొన్నియిన్ సెల్వన్ నాలుగు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 

మణిరత్నం ప్రతిష్టాత్మకంగా పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి స్టార్ క్యాస్ట్ ప్రధాన పాత్రలు చేశారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios