ప్రభాస్ సినిమా కోసం అమితాబ్ కు షాకిచ్చే రెమ్యునేషన్
50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో బిగ్బి అమితాబ్ బచ్చన్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నట్టు చిత్రం టీమ్ వెల్లడించింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ కలయికలో అగ్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో బిగ్బి అమితాబ్ బచ్చన్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నట్టు చిత్రం టీమ్ వెల్లడించింది.
అమితాబ్ ఈ ప్రాజెకుటులోకి రావటంతో ఈ ప్రాజెక్ట్కు మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్, అమితాబ్ అలాగే మూవీ టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ నేపధ్యంలో అమితాబ్ ని ఈ ప్రాజెక్టుకు ఎంత పే చేస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నిమిత్తం అమితాబ్ బచ్చన్ కు ..ఇరవై ఐదు కోట్ల రూపాయలు పే చేస్తున్నారు. అమితాబ్ ని ఈ ప్రాజెక్టులోకి తీసుకురావటంతో నార్త్ ఇండియాలో ఈ సినిమా వచ్చే హైప్ పెరుగుతుందనేది నిజం. ఇక అమితాబ్ క్రితం సంవత్సరం సైరా నరసింహా రెడ్డి తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు.
ఇక ‘ఎంతో ప్రతిష్టాత్మకమైన, మైలురాయి లాంటి ఈ సినిమాలో భాగం కావడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్కు అభినందనలు. ఇలాగే మరో 50 ఏళ్లను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా’.. అని బిగ్బి కామెంట్ చేశారు. అమితాబ్తో కలిసి నటిస్తుండడం పట్ల అమితాబ్ బచ్చన్ సార్తో తెరపంచుకోబోతున్నాను.. కల నిజమైంది అంటూ డార్లింగ్ ప్రభాస్ సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.