ఐకాన్ స్టార్ `పుష్ప` సరికొత్త రికార్డ్.. ఇండియా వైడ్గా నెంబర్ వన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప` చిత్రం సరికొత్త రికార్డుని సృష్టించింది. ఐఎండీబీ ప్రకటించిన లిస్ట్ లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.
అల్లు అర్జున్ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల చేయబోతున్నారు. అంతేకాదు రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్గా కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా సరికొత్త రికార్డు ని సృష్టించింది. దేశం మొత్తం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా జాబితాలో నిలిచింది. ఐఎండీబీ ప్రకటించిన `మోస్ట్ ఆంటిసిపేటెడ్ ఇండియన్ మూవీ` జాబితాలో నెంబర్ 1 స్థానంలో నిలించింది. రెండు నెలల క్రితం విడుదలైన ఈ చిత్ర టీజర్ సైతం రికార్డులు సృష్టిస్తుంది. అది దాదాపు 75 మిలియన్స్ వ్యూస్ సాధించి టాలీవుడ్లో టాప్లో నిలిచింది. ఇప్పుడు మరో రికార్డ్ సాధించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.