కాకినాడ పోర్ట్ లో అల్లు అర్జున్..అక్కడేం పని
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.ఈ సినిమా షూటింగ్ నిమిత్తం అల్లు అర్జున్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో వెళ్లారు. అక్కడ పోర్ట్ లో ఆయనపై ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. సినిమాలో కీలకమైన ఎపిసోడ్ గా రానున్న ఈ సీన్ ..పది రోజులు పాటు షూట్ జరగనుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.ఈ సినిమా షూటింగ్ నిమిత్తం అల్లు అర్జున్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో వెళ్లారు. అక్కడ పోర్ట్ లో ఆయనపై ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. సినిమాలో కీలకమైన ఎపిసోడ్ గా రానున్న ఈ సీన్ ..పది రోజులు పాటు షూట్ జరగనుంది. ఇప్పటికి దాదాపు నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇండిపెండిన్స్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయనున్నారు. ఆ రోజే టైటిల్ ఏంటనేది తెలుస్తోంది.
కాగా ఈ సినిమాకు ‘నాన్న-నేను’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు వెబ్సైట్లులో వార్తలు రాశాయి. అయితే దీనిపై చిత్రం టీమ్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నాన్న సెంటిమెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలోనూ నాన్న సెంటిమెంట్ను చక్కగా చూపించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు... పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. బన్నీ, పూజా హెగ్డే కాంబినేషన్లో రాబోతున్న రెండో చిత్రమిది. గతంలో వీరిద్దరూ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంలో నటించారు. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్, సుశాంత్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.