‘పుష్ప 2’లో గెస్ట్ గా బాలీవుడ్ హీరో, ఏ పాత్రలో అంటే..
దే నిజం అయితే.. పుష్ప 2 కి బాలీవుడ్ లో ఈ సినిమాకు గిరాకీ పెరుగుతుంది. ఆ గెస్ట్ రోల్ మరెవరో కాదు ...
తెలుగు లోనే కాదు పాన్ ఇండియా లెవల్లో ఎంతో ఆసక్తి రేపుతున్న సినిమా పుష్ప: ది రూల్. 2021 డిసెంబర్ లో వచ్చిన పుష్ప: ది రైజ్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బాహుబలి, కేజీఎఫ్ ల సీక్వెల్స్ రేంజ్ లో పుష్ప సీక్వెల్ కూడా ఉంటుందని, ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాయడం ఖాయమని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ బెల్ట్ లో ఓ రేంజిలో క్రేజ్ లేపటానికి టీమ్ రకరకాల ప్లాన్ లు చేస్తోంది. అక్కడ ఓ బాలీవుడ్ స్టార్ హీరో చేత గెస్ట్ రోల్ చేయిస్తోందని సమాచారం. ఇదే నిజం అయితే.. పుష్ప 2 కి బాలీవుడ్ లో ఈ సినిమాకు గిరాకీ పెరుగుతుంది. ఆ గెస్ట్ రోల్ మరెవరో కాదు షాహిద్ కపూర్ అంటున్నారు.
అల్లు అర్జున్ పాత్రను పరిచయం చేస్తూ వచ్చే ఈ గెస్ట్ రోల్ ....సినిమాలో ఊహించని విధంగా గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా నిలుస్తోందని.. పైగా ఈ పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని సమాచారం. ఈ పుష్ప సీక్వెల్ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో ఇంట్రడ్యూస్ కానున్నాయి. పుష్ప తో వచ్చి అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టాడు. రష్మిక పెర్ఫామెన్స్, సమంత స్పెషల్ సాంగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. పుష్ప ది రూల్ కూడా ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా ఉండేలా డైరెక్టర్సుకుమార్ప్లాన్చేస్తున్నాడు.
ఈ నేపధ్యంలో పుప్ప 2 థియేట్రికల్రైట్స్ రూ.వెయ్యి కోట్లు డిమాండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అన్ని భాషల్లో కలిపి వెయ్యి కోట్ల వరకు గ్రాస్ రావ్వొచ్చని సినిమా సర్కిల్స్ లో సోషల్ మీడియాలో డిస్కషన్స్ చేస్తున్నారు. మరి పుప్ప2 ఈ రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఏప్రిల్ లేదా మే నెలలో గ్రాండ్ గా విడుదల చేయాలని ఫైనల్ అయ్యారట సుకుమార్.