మంచి కంటెంట్‌ ఉన్న ఇతర భాషల చిత్రాలను తెలుగు వారికి అందిస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ తన బ్యానర్‌లో క్రేజీ మూవీస్‌ని నిర్మించడమే కాదు, ఇతర భాషల్లో మంచి విజయాలు సాధించిన చిత్రాలను తెలుగులో విడుదల చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. సక్సెస్‌లో భాగమవుతున్నారు. `కాంతార` విషయంలో అదేజరిగింది. ఇప్పుడు ఆయన మరో బ్లాక్‌ బస్టర్‌ సినిమాని తెలుగులోకి తీసుకురాబోతున్నారు. తమిళంలో ఇటీవల విడుదలైన సంచలన విజయం సాధించింది `విడుతలై పార్ట్ 1` చిత్రాన్ని తెలుగులో డబ్‌ చేయబోతున్నారు. 

 తెలుగులో "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చాలా సినిమాలను విడుదల చేశారు. ఇప్పుడు తెలుగులో మరో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో సక్సెస్‌ సాధించిన `విడుదలై పార్ట్ 1` చిత్రాన్ని తెలుగులోకి తీసుకురాబోతున్నారు. మావెరిక్ ఫిల్మ్ మేకర్ వెట్రిమారన్ రచించి, దర్శకత్వం వహించిన చిత్రం `విడుతలై పార్ట్ 1`. ఈ పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మార్చి 31న తమిళనాడు అంతటా, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అక్కడ విశేష స్పందన లభించింది. 

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సూరి కథానాయకులుగా నటించారు. థియేటర్లలో విడుదలయ్యాక, ప్రశంసలతోపాటు బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. దక్షిణ-భారత చలనచిత్రాలు అన్ని భాషల ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఒక మంచి సినిమాను ఆదరిస్తారు. ఇదివరకే "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా రిలీజైన `కాంతార`, `మాలికాపురం` వంటి సినిమాలకు విశేష ఆదరణ దక్కింది. అందులో భాగంగానే ఇప్పుడు `విడుతలై పార్ట్ 1` కోసం కూడా మన తెలుగు ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో మంచి కంటెంట్‌ని తెలుగు ఆడియెన్స్ కి అందించాలనే లక్ష్యంతో నిర్మాత అల్లు అరవింద్‌ `విడుతలై పార్ట్ 1` సినిమాని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. అయితే ఎప్పుడు రిలీజ్‌ చేస్తానేది క్లారిటీ రావాల్సింది. `కాంతార `తో మంచి విజయాన్ని అందుకున్న "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" అలానే `విడుతలై`తో కూడా అదే విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు. ఉత్కంఠ రేపుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని RS ఇన్ఫోటైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఆర్ వేల్‌రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసారు. లెజెండరీ మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేశారు. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే సహ రచయిత అయిన బి జయమోహన్‌ తునైవన్ ఆధారంగా రూపొందించబడింది.