Asianet News TeluguAsianet News Telugu

కారులో అల్లు అర్జున్, అల్లు అర్హ నైట్ రైడ్.. ఈ తండ్రీకూతురు ఏం చేశారో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంత ప్రియారిటీ ఇస్తారో తెలిసిందే. ముఖ్యంగా కూతురు అంటే బన్నీకి మాటల్లో చెప్పలేనంత ఇష్టం. తాజాగా కూతురు కోసం అల్లు అర్జున్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
 

Allu Ajun night ride with daughter Allu Arha, do you know What they did?
Author
First Published Nov 1, 2022, 2:52 PM IST

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం భారీ స్కేల్ చిత్రాలతో బిజీ షెడ్యూల్ ను ఫాలో అవుతున్నారు. ‘పుష్ప’ తర్వాత బన్నీ స్థాయి ఆమాంత పెరిగిపోయింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ పోజిషనల్ లో ఉన్నారు. అయితే అల్లు అర్జున్ సినిమాల పట్ల ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీ టైమ్ ను మాత్రం అస్సలు మిస్ కారు. భార్య అల్లు స్నేహా, కొడుకు అయాన్, కూతురు అల్లు అర్హా (Allu Arha)తోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఫ్యామిలీతో కలిసి ఆయా ప్రదేశాలను చుట్టేందుకు ఇష్టపడుతుంటారు.

ముఖ్యంగా అల్లు అర్జున్ కు తన కూతురు అల్లు అర్హా అంటే ప్రాణం. కూతురితో ఎంత సరదాగా, ఫ్రెండ్లీగా ఉంటారో తెలిసిందే. అల్లు అర్హ పుట్టినప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా ఈ తండ్రీకూతురు ఎప్పటికీ సందడి చేస్తున్నారు. రీసెంట్ గా ఇండిపెండెన్స్ డే వేడుకల్లో, అలాగే గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అల్లు అర్జున్, అర్హ అర్హా సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి నెట్టింట ప్రత్యక్షమయ్యారు. ఈసారి ఏకంగా కూతురి కోసం అల్లు అర్జున్ కారులో నైట్ రైడ్ కు వెళ్లారు. 

ఈ సందర్భంగా నైట్ మీల్స్ తింటూ కెమెరా కంటికి చిక్కారు. కారులోనే అల్లు అర్జున్, అర్హ అర్ధరాత్రి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడం ఫొటోలో చూడొచ్చు. బన్నీ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ కూతురి కోసం ఇలా అవుటింగ్ కు రావడం విశేషం. కుటుంబం పట్ల అల్లు అర్జున్ చూపుతున్న శ్రద్ధ, లవ్ అండ్ అఫెక్షన్ ను అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం తండ్రీకూతురు కారులో కలిసి భోజనం చేస్తున్న ఈ ఫొటోను కూడా నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ఫ 2’(Pushpa 2)లో నటిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ను జరుపుకున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా పోస్టర్ డిజైన్స్  కోసం అల్లు అర్జున్, రష్మిక మందన్నపై ఫొటోషూట్ నిర్వహించారు. చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై Pushpa The Ruleను రూ.350 కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios