నా భర్తకు అమ్మాయిల పిచ్చి.. బుల్లితెర నటుడిపై భార్య ఆరోపణలు..!
పవిత్ర నాథ్ రియల్ లైఫ్లో మాత్రం విలన్ అని ఆయన భార్య శశిరేఖ పేర్కొంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
టీవీ సీరియల్స్ గురించి అవగాహన ఉన్నవారందరికీ.. మొగలిరేకులు గురించి తెలిసే ఉంటుంది. దశాబ్దకాలం క్రితం వచ్చి సూపర్ హిట్ అయిన సీరియల్ ఇది. ఇప్పటికీ ఈ సీరియల్ గురించి.. అందులో నటించిన నటుల గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. కాగా.. ఆ సీరియల్ లో కీలక రోల్ ప్లే చేసిన నటుడు పవిత్ర నాథ్ తాజాగా వార్తల్లోకి ఎక్కారు. ఆయనపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు.
మొగలిరేకులు సీరియల్లో దయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర నాథ్ రియల్ లైఫ్లో మాత్రం విలన్ అని ఆయన భార్య శశిరేఖ పేర్కొంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
Also Read: `రింగ్ మాస్టర్ నువ్వే`.. వర్మకి మంచు మనోజ్ దిమ్మతిరిగే కౌంటర్..
'పవిత్రనాథ్తో 2009లో పెళ్లి జరిగింది. పెళ్లయిన నాటి నుంచి అతనికి అమ్మాయిలంటే పిచ్చి. జాతకం పేరుతో ఎంతోమంది అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకొచ్చేవాడు. ఏదేంటని ప్రశ్నిస్తే పలుసార్లు చేయి చేసుకున్నాడు. అంతేకాకుండా ఓ అమ్మాయితో8 ఏళ్లు ఎఫైర్ నడిపించి తనని కూడా మోసం చేశాడు. ప్రతిరోజూ ఇంటికి తాగొచ్చి టార్చర్ పెడతాడు. తను ఏ సీరియల్స్లో నటిస్తున్నాడో నాకు ఒక్కరోజు కూడా చెప్పలేదు. పదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా' అంటూ పేర్కొంది.
Also read: దేవాయని ప్లాన్ సక్సెస్.. వసు, జగతిపై రిషి శాడిజం.. అసలు కథ ఇప్పుడే ప్రారంభం
కనీసం తనకు విడాకులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆమె వాపోయింది. ఈ విషయం గురించి తన అత్తమామాలకు చెప్తే తననే ఇంట్లోంచి గెంటేశారని తెలిపింది. తనకు జరిఘిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగొద్దని, తన భర్తను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పవిత్ర నాథ్ కృష్ణ తులిసి అనే సీరియల్లో మల్లికార్ణున్ అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు.