ఆర్ ఆర్ ఆర్:తప్పుకున్న ఆలియా భట్, సీన్ లోకి ఆమె?
'ఆర్.ఆర్.ఆర్'లో చెర్రీ సతీమణిగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే అలియా తెలుగు తెరకు పరిచయం కానుంది. అయితే ఇప్పుడామె తప్పుకుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఎన్నో అంచనాల మధ్య ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్నతాజా చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలాగే 'ఆర్.ఆర్.ఆర్'లో చెర్రీ సతీమణిగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే అలియా తెలుగు తెరకు పరిచయం కానుంది. అయితే ఇప్పుడామె తప్పుకుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి సుశాంత్ మృతి తరువాత అలియాపై నెగిటివిటీ పెరిగినప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తీసేందుకు రాజమౌళి ఏ మాత్రం ఇష్టపడలేదట. కానీ డేట్లు క్లాష్ అవుతుండటంతో, ఆర్ఆర్ఆర్ నుంచి తాను తప్పుకుంటానని ఆమె స్వయంగా చెప్పిందట. ఇక అలియా నిర్ణయానికి రాజమౌళి టీమ్ కూడా ఒప్పుకున్నట్లు టాక్. దీంతో రామ్ చరణ్ కోసం మరో బాలీవుడ్ నటిని వెతికే పనిలో టీమ్ పడ్డారట. ఈ క్రమంలో చెర్రీ, ప్రియాంక చోప్రా పేర్లు ప్రస్తావనకు వచ్చాయిట.
గతంలో జంజీర్(తెలుగులో తుఫాన్) మూవీలో చెర్రీ, ప్రియాంక కలిసి నటించగా.. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో ప్రియాంక పేరును సూచించగా.. అందుకు జక్కన్న కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రియాంక కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అన్నీ కుదిరితే చెర్రీతో ప్రియాంక మరోసారి జోడి కట్టనుంది.
ఇక లాక్ డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసారు. పూణే షెడ్యూల్ లో అలియా టీంతో జాయిన్ కానుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. కాని కరోనా కారణంగా పూణే షెడ్యూల్ వాయిదా పడింది. అలియా భట్ ఇంత వరకు ఒక్కరోజు కూడా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనలేదు.
అనేక భారతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు 70శాతం పూర్తి అయ్యింది. కరోనా నేపథ్యంలో సినిమా చిత్రీకరణలకు బ్రేక్ పడటంతో.. ఆర్ఆర్ఆర్ టీమ్ ఇంట్లోనే ఉండిపోవాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ షూటింగ్ని సెప్టెంబర్లో ప్రారంభించాలని జక్కన్న అనుకుంటున్నారట.