Asianet News TeluguAsianet News Telugu

పులొచ్చింది.. మేక చచ్చింది: జేమ్స్‌బాండ్‌ను బీట్‌ చేసిన బన్ని

అప్పటినుంచి ఈ ట్రైలర్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తూనే ఉంది.  తాజాగా  హాలీవుడ్‌ ‘జేమ్స్‌ బాండ్‌’ ట్రైలర్ ను బీట్‌ చేసింది. ఈ నేపధ్యంలో ఈ ట్రైలర్ లోని లాస్ట్ డైలాగు పులొచ్చింది.. మేక చచ్చింది ని గుర్తు చేస్తున్నారు అబిమానులు. 

Ala Vaikunthapurramuloo beats James Bonds No Time To Die  trailer jsp
Author
Hyderabad, First Published Dec 6, 2020, 7:18 AM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంవత్సరం మొదట్లో రిలీజైన చిత్రం 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్టైంది. జనవరి 12న విడుదల అయిన ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కొత్త ఊపుని ఇచ్చింది.   'అల వైకుంఠపురములో' కలెక్షన్స్ రికార్డ్ స్దాయిలో వచ్చాయి. రూ.262 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ లో అంచనా వేశారు. మరో ప్రక్క రిలీజ్ కు ముందు సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఆ ట్రైలర్ విడుదలై 24 గంటలు గడవకుండానే 50 లక్షల వ్యూస్ సాధించింది. అప్పటినుంచి ఈ ట్రైలర్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తూనే ఉంది.  తాజాగా  హాలీవుడ్‌ ‘జేమ్స్‌ బాండ్‌’ ట్రైలర్ ను బీట్‌ చేసింది. ఈ నేపధ్యంలో ఈ ట్రైలర్ లోని లాస్ట్ డైలాగు పులొచ్చింది.. మేక చచ్చింది ని గుర్తు చేస్తున్నారు అబిమానులు. 

 ‘అల వైకుంఠపురములో..’ ట్రైలర్‌ ‘జేమ్స్‌ బాండ్‌: నో టైమ్‌ టు డై’ ట్రైలర్‌ వ్యూస్‌ను అధిగమించింది. ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది అత్యధికంగా చూసిన టాప్‌-20 ట్రైలర్ల  లిస్ట్ లో చోటుదక్కించుకుంది. ఇందులో సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమ నుంచి కేవలం బన్నీ చిత్రం మాత్రమే ఉండటం చెప్పుకోదగ్గ విషయం. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు  ఏడు వేల ట్వీట్లతో AlaVaikunthapurramuloo హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

టాప్‌-10 ట్రైలర్ల జాబితా 
1. ఆఫ్టర్ వి కొలైడెడ్
2. బాట్మాన్
3. డూన్
4. టెనెట్‌
5. బ్యాడ్‌ బాయ్స్‌ ఫర్‌ లైఫ్‌
6. బాఘి 3
7. అల వైకుంఠపురములో..
8. ది ఇన్విజిబుల్‌ మెన్‌
9. జేమ్స్‌బాండ్‌: నో టైమ్‌ టు డై
10. వాండా విజన్‌.. 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బన్నీ, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ఇది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.  ఈ ట్రైలర్ లో ..‘‘నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది నాన్న.. చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది’’, ‘‘దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు వాళ్లకి. అలాంటోళ్లతో మనకి గొడవేంటి సార్. జస్ట్ సరెండర్ అయిపోవాలంతే’’ డైలాగులు ట్రైలర్‌లో బాగా ఆకట్టుకున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios