తెలుగు హిట్ రీమేక్,అక్షయ్ గ్రీన్ సిగ్నల్,ఆగస్టు నుంచే షూటింగ్
ఈ రీమేక్ సినిమాలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. బెల్ బాటమ్ డైరక్టర్ రంజిత్ తివారీ డైరక్షన్ చేస్తున్నారు. ఆగస్టు నుంచి అమెరికాలో షూటింగ్ చేస్తారు. 2022 లో రిలీజ్ పెట్టుకుందామని ప్లాన్ చేసారు.
అక్షయ్ కుమార్ బాలీవుడ్ రీమేక్ రాజాగా మారిపోతున్నారని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. సౌత్ లో హిట్ అవుతున్న సినిమాలపై ఆయన పూర్తి దృష్టి పెట్టారు. ఇక్కడ హిట్టైన సినిమా పట్టుకెల్తే డేట్స్ ఇచ్చేస్తున్నారు. విక్రమార్కుడు రీమేక్ తో హిట్ కొట్టాక మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. కాంచన రీమేక్ లక్ష్మి వంటివి బోల్తా కొట్టినా ఆయన లైట్ తీసుకుంటున్నారు. తాజాగా ఆయన తెలుగులో మంచి హిట్టైన రాక్షసుడు రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఈ సినిమాని త్వరలో చేయబోతున్నారని అఫీషియల్ గా ప్రకటించారు.
ఈ సినిమాకు ఆపరేషన్ సిండ్రిల్లా అనే టైటిల్ పెట్టారు. ఈ రీమేక్ సినిమాలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. బెల్ బాటమ్ డైరక్టర్ రంజిత్ తివారీ డైరక్షన్ చేస్తున్నారు. ఆగస్టు నుంచి అమెరికాలో షూటింగ్ చేస్తారు. 2022 లో రిలీజ్ పెట్టుకుందామని ప్లాన్ చేసారు. ఆ మధ్యన వరస ప్లాఫ్ ల్లో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ కు .. ‘రాక్షసుడు’ ఊపిరి పోసింది. తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన ‘రాచ్చసన్’ సినిమాకు ఇది రీమేక్.
‘రైడ్, వీర’ చిత్రాల ఫేం రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. హవీష్ లక్ష్మణ్ ప్రొడక్షన్లో ఎ స్టూడియోస్ బ్యానర్పై కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమాని హిందీలో స్వయంగా హవీష్ నిర్మిద్దామనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో హిందీకు రైట్స్ అమ్మేసినట్లు సమాచారం. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కింద ఏకంగా 2.7 కోట్ల భారీ రేటు ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఇక ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘బెల్ బాటమ్’. అక్షయ్ కుమార్ హీరోగా రంజిత్ ఎం.తివారీ తెరకెక్కించిన చిత్రమిది. కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా థియేటర్లు తాత్కాలికంగా మూతపడటంతో ఈ చిత్రం డిజిటల్ మాధ్యమం వేదికగా విడుదలవుతుందంటూ ప్రచారం సాగింది. ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా ప్రసారం కానుందంటూ కథనాలు వెలువడ్డాయి. తాజాగా వాటన్నింటికీ సమాధానం ఇచ్చాడు అక్షయ్. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. జులై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. వాణీ కపూర్, హ్యూమా ఖురేషీ, లారా దత్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.