నాగార్జున షాకింగ్ కామెంట్స్, సీతారామం నేను చేయాల్సింది దుల్కర్ దగ్గరకు వెళ్లిందంటూ...
ఈనెలలో రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర శుభారంభానిచ్చాయి. టాలీవుడ్ కు మంచి హోప్ నిచ్చాయి. బింబిసారతో పాటు సీతారామం సినిమాలు సక్సెస్ తో టాలీవుడ్ కు జోష్ వచ్చింది. ఇక మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో చేసి సక్సెస్ సాధించిన సీతారామం సినిమా కింగ్ నాగార్జున చేయాల్సిందట. మరి అది ఎలా మిస్ అయ్యింది...?
మలయాళ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మన్ హీరోగా నటించి మెప్పించిన డైరెక్ట్ తెలుగు సినిమా సీతారామం. ఈమూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అద్బుతమైన విజయాన్ని అందుకుంది. దాంతో ఇండస్ట్రీ నుంచి మూవీ టీమ్ కు ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి. అందులో ముఖ్యంగా నిర్మాత అశ్వినీ దత్ థియేటర్ కు వెళ్లి మరీ.. ఆడియన్స్ మధ్య సినిమా చూశారు. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆధరిస్తారు అనడానికి ఇది ఉదాహరణ అన్నారు స్టార్ ప్రొడ్యూసర్. అటు టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాపై స్పందించారు. సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మికా మందన్న కీలక పాత్రలో నటించిన సీతారామం సినిమాహను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించారు. ఈ నెల 5న విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సీతారామం సినిమా టీమ్ ఆడియనస్ కు థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. సీతారామంలాంటి సినిమా తీయడానికి ధైర్యం కావాలి. స్వప్న, ప్రియాంకలు అశ్వనీదత్గారికి పెద్ద అండగా నిలుస్తున్నారు. మహానటి, జాతిరత్నాలు, సీతారామం లాంటి మంచి సినిమాలు సినిమాలు వారు నిర్మించారు. అని అన్నారు.
అంతే కాదు సీతారామం సినిమా చూసి అసూయపడ్డాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కింగ్ నాగార్జున. నాకు రావాల్సిన రోల్ దుల్కర్కి వెళ్లింది. అసలు నేను చేయాల్సిన రోల్ అంది అంటూ నాగ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు ఈసినిమా చూస్తున్నంత సేపు పాతరోజులు గుర్తుకు వచ్చాయన్నారు నాగ్. తను నటించిన గీతాంజలీ, సంతోషం, మన్మథుడు లాంటి సినిమాలు గుర్తుకు వచ్చాయన్నారు.. టాలీవుడ్ కింగ్.
ఇక తనను టాలీవుడ్ ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు దుల్కర్. డైరెక్టర్ హను రాఘవపూడి కూడా తను చేసిన నాలుగు సినిమాల్లో ఇది చాలా స్పెషల్ అన్నారు. అటు నిర్మాత అశ్వీన్ దత్ మాట్లాడుతూ..మహానటి, సీతారామం లాంటి హిట్స్ ఇచ్చి దుల్కర్ సల్మాన్ ఇక మా హీరో అయిపోయాడన్నారు.