పూరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి...డేట్ ఇచ్చారు,ఓటీటీ పుణ్యమే?
సినిమా షూటింగ్ టైంలో ప్రచార చిత్రాలతో తెగ హడావిడి చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ కు రెడీగా ఉండగా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. థియేటర్లు మూత పడతంతో ఆమధ్య రొమాంటిక్ సినిమాను ఓటీటీ రిలీజ్ చేస్తారని అన్నారు.కాని అది కూడా ముందుకు జరగట్లేదు.
ఇప్పుడున్న పరిస్దితుల్లో ఓ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటం అంటే మాటలు కాదు. వరస సినిమా రిలీజ్ లు ,మరో ప్రక్క థర్డ్ వేవ్ భయాలు, పెద్ద సినిమా ల పోటీ...ఇలా వరసపెట్టి వెంటాడుతున్నాయి. అయితే అదే సమయంలో కరోనా తో కలిసొచ్చిన అంశం ఓటీటి. ఓటీటి మార్కెట్ కూడా యాడ్ అవటంతో ధైర్యంగా థియోటర్ లో రిలీజ్ చేసి, ఆనక ఓటీటితో డబ్బులు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ రిలీజ్ పెండింగ్ ఉన్న ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా అనిల్ పాదూరి తెరకెక్కించిన చిత్రం ‘రొమాంటిక్’. దర్శకుడు పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్ప్లే, మాటలందించిన ఈ చిత్రం రిలీజ్ కు ముస్తాబు చేసారు.సెన్సార్ కూడా పూర్తి చేసారు.
ఈ సినిమా థియోటర్ బిజినెస్ విషయం ప్రక్కన పెడితే ఓటీటిలో మంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అందుకే వెంటనే రిలీజ్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాల ద్వారా వినికిడి. ఆయనే ఛార్మి కౌర్తో కలిసి స్వయంగా నిర్మించారు. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిత్ర బృందం శనివారం ఓ కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఆ ప్రచార చిత్రంలో ఆకాష్.. కేతిక మెడపై ముద్దు పెడుతూ రొమాంటిక్గా కనిపించారు. ‘‘రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తైంది. రకరకాల కారణాలతో రిలీజ్ ఆగిపోయింది. సినిమా షూటింగ్ టైంలో ప్రచార చిత్రాలతో తెగ హడావిడి చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ కు రెడీగా ఉండగా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. థియేటర్లు మూత పడతంతో ఆమధ్య రొమాంటిక్ సినిమాను ఓటీటీ రిలీజ్ చేస్తారని అన్నారు.కాని అది కూడా ముందుకు జరగట్లేదు.అయితే ఇన్నాళ్లకు విడుదల తేదీ ఖరారు చేసారు. జూన్ 18న థియేటర్లలో సినిమా రిలీజ్ కానున్నట్లు హీరో ఆకాష్ తన ఇన్స్టాగ్రామ్లో అధికారికంగా ప్రకటించాడు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన పోస్టర్స్ ని బట్టి సినిమా ఎంత రొమాంటిక్గా ఉండబోతోందో అర్థమవుతోంది.
ఇక ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రొమాంటిక్ సినిమా టీజర్ను పూరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అలాగే పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆంధ్రాపోరి చిత్రంతో టాలీవుడ్లోకి ఆకాష్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2018లో మెహబూబా చిత్రంతో పలకరించాడు. ఇండియా- పాకిస్తాన్ ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఈ సినిమాతో అయినా హిట్ కొట్టాలని ఆకాష్ ఎదురు చూస్తున్నాడు.