కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ మూవీ సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. 


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ సలార్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా విజయ్ కిరాగందూర్ నిర్మిస్తున్న ఈ మూవీ గురించి రోజుకో వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా టీజర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి ఈ చిత్రం గురించి టాక్ జనాల్లో మరీ హాట్ గా మారింది. ఇక ట్రైలర్ రిలీజ్ దగ్గర పడుతున్న నేపధ్యంలో ట్రేడ్ లో  ఈ సినిమా గురించి గమ్మత్తైన వార్తలు వినపడుతున్నాయి. 

అందుతున్న సమాచారం మేరకు..#Salaar ట్రైలర్ వచ్చాక , అది క్రియేట్ చేసే సెన్సేషన్ క్రియేట్ చూసి చాలా సినిమాలు తప్పుకుని దారి ఇస్తాయి అంటున్నారు. ఇప్పుడు ధైర్యంగా సలార్ కు దగ్గరలో రిలీజ్ కి క్యూ కట్టిన పెద్ద సినిమాలు సైతం వాయిదా పడతాయి అంటున్నారు. ఆ స్దాయిలో ట్రైలర్ ఉండబోతోందని సమాచారం. అదే నిజమైతే ఖచ్చితంగా ప్రభాస్ ప్యాన్స్ కు పండగే.  

ఇక ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ ట్రైలర్‌లో కూడా యాక్షన్స్ సీక్వెన్స్‌లు, ఎలివేషన్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. ట్రైలర్‌లో యాక్షన్‍ను అధికంగా చూపించేందుకే చిత్ర యూనిట్ నిర్ణయించుకుందట. సలార్ స్టోరీ గురించి ట్రైలర్‌లో ఎక్కువగా రివీల్ చేయకూడదని డిసైడ్ చేసుకుందని సమాచారం.

మరో ప్రక్క  ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ అవుతుందా లేదా అని. అందుకు కారణం గతంలో ఇంగ్లీష్ వెర్షన్ గురించిన వార్తలు రావటమే.  సాంగ్స్ , కామెడీ సీన్స్ ని మినయించి ఇంగ్లీష్ లో డబ్  చేస్తున్నారని, ఈ మూవీ తెలుగు వర్షన్ తో పోలిస్తే ఇంగ్లీష్ లో  అరగంట నిడివి తేడా ఉంటుందని అన్నారు. అయితే ఈ విషయమై సంస్ద నుంచి ఎనౌన్సమెంట్ మాత్రం రాలేదు.  సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతోన్న ఈ మూవీ ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.  రాబోయే మరికొన్ని రోజుల్లో సలార్ నుండి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రిలీజ్ చేయనున్నారు యూనిట్ సభ్యులు. అందులో ఈ అప్డేట్ కూడా వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. 
  
హోంబలే ఫిల్మ్స్‌ తెలుగులో నిర్మిస్తున్న మొదటి చిత్రం సలార్. ప్రభాస్ ఈ చిత్రం ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు.  ప్రభాస్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. హాలీవుడ్ స్టాండర్డ్ తో యాక్షన్ సన్నివేశాలను ఈ సినిమా కోసం డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది.  ఇక సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో టీమ్ ప్రమోషన్స్‌ను షురూ చేసింది.