Asianet News TeluguAsianet News Telugu

నాని ఆఫీస్ లో అడివి శేషు, మీనాక్షి రచ్చ.. షాకింగ్ కామెంట్స్ చేసిన నేచురల్ స్టార్.!?

టాలెంటెడ్ హీరో అడివి శేష్ తాజాగా నటించి క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘హిట్ 2’. వచ్చే నెలలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా అడివి శేష్ ప్రమోషన్స్ ను విభిన్నంగా నిర్వహిస్తున్నారు. దీనిపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
 

Adivi Sesh in Hit 2 promotions, Natural Star Nani shocking comments on it!?
Author
First Published Nov 13, 2022, 1:59 PM IST

దివంగత మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్  జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh). ఈ చిత్రం భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ వెంటనే ‘హిట్ 2’ (Hit 2) చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అడివి శేష్ కూడా విభిన్నంగా సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

వాల్ పోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్  నాని (Nani) సమర్పిస్తున్నారు. నిర్మాత ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. చిత్రం విడుదల కాబోతుండటంతో నాని సినిమాకు అండగా నిలుస్తున్నారు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ సాంగ్ ‘ఉరికే ఉరికే’ (Urike Urike) ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అడివి శేష్, మీనాక్షి చౌదరి రొమాంటిక్ స్టెప్పులేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలి సినిమాను ప్రమోట్ చేశారు. అయితే వారిద్దరూ స్టెప్పులేసింది నాని ఆఫీసులోనే నంట. ఇది చూసిన నాని ఆసక్తికరంగా స్పందించారు. ‘నా ఆఫీస్ ను ఇలా కూడా వాడొచ్చా’ అని అడివి శేష్, మీనాక్షి చౌదరిని ట్వీట్ ద్వారా సరదాగా ప్రశ్నించారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హిట్ : ది సెకండ్ కేస్’ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ‘హిట్ : ది ఫస్ట కేస్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్ ‘హిట్ వెర్స్’తో ఆసక్తి పెంచుతున్నారు. ప్రస్తుతం నెక్ట్స్ లెవల్ డైరెక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్,  పాటలు ఆకట్టుకుంటున్నాయి.  

సెకండ్ కేసు లో మరింతగా యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలను చూపించనున్నారు. కాస్తా వైలెంట్ గానే ప్రేక్షకుల ముందుకు రాబోతోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీక్వెల్ లోని రక్తపాతం, క్రైమ్ సన్నివేశాలకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయగా యూట్యూబ్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఏదేమైనా ఇఫ్పటికే హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. బాణు చందర్, రావు రమేష్, పోసాని క్రిష్ణ మురళీ, తనికెళ్ల భరణి, కోమలీ ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios